తమ అభిమాన జట్టు విశ్వ వేదికలపై నిలిచి గెలవాలని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు. కేవలం క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు జట్టులో ఉన్న ఆటగాళ్లు కూడా విశ్వ వేదికలపై సత్తా చాటడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం టీమిండియా ఎంతో పటిష్టంగానే ఉంది.. ఓవైపు బ్యాటింగ్ విభాగంలో మరోవైపు బౌలింగ్ విభాగంలో కూడా ఎంతో బలంగా కనిపిస్తుంది. కానీ కొన్ని కొన్ని సార్లు సీనియర్లు జట్టుకు మైనస్ గా మారిపోతున్నారు. జట్టులోకి జూనియర్ లు ఎంట్రీ ఇచ్చినప్పటికీ వారికి పెద్దగా అనుభవం లేకపోవడంతో వారు కూడా ఒత్తిడిని తట్టుకోలేక విఫలమవుతున్నారు. ప్రస్తుతం టీమిండియా లో ఇదే జరుగుతుంది అని చెప్పాలి. ఇలాంటి తరుణంలో వచ్చే ఏడాది వరల్డ్ కప్  జట్టులో మార్పులు చేయాలని ప్రస్తుతం మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


 ముఖ్యంగా ప్రస్తుతం జట్టులో సీనియర్ ప్లేయర్లు గా కొనసాగుతున్న వారికి కాస్త విశ్రాంతి ఇచ్చి.. యువ ఆటగాళ్లకు జట్టులోకి తీసుకోవడం వల్ల వారికి అనుభవంతో పాటు ఎన్నో మెళుకువలు నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.. ఇటీవలే టి20 వరల్డ్ కప్ లో భాగంగా టీమ్ ఇండియా వరుసగా రెండు మ్యాచ్లలో విఫలం అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉండటం గమనార్హం.  ఇక రానున్న రోజుల్లో అటు బిసిసిఐ కూడా ఎంతో మంది యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడానికి సిద్ధం అయింది అన్న టాక్ కూడా వినిపిస్తోంది.


 ఇక ఇటీవలే టీం ఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఈ ఈ విషయం పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 2022 టి20 ప్రపంచకప్ కోసం టీమిండియా ఐదుగురు యువ ఆటగాళ్ల పై దృష్టి పెడితే ఎంతో బాగుంటుంది అంటూ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, కె.ఎల్.రాహుల్, రూతురాజ్ గైక్వాడ్ లను వచ్చే టి20 వరల్డ్ కప్ కోసం ఇప్పటి నుంచే సిద్ధం చేయాలి అంటూ చెప్పుకొచ్చాడు. వరల్డ్ కప్ కి ముందు సీనియర్లకు విశ్రాంతి ఇచ్చి యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించాలంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ యువ ఆటగాళ్ల టీమిండియా భవిష్యత్ అని.. ఇక వీరు వరల్డ్ కప్ తీసుకువస్తారు ఆశాభావం వ్యక్తం చేశాడు వీరేంద్ర సెహ్వాగ్.

మరింత సమాచారం తెలుసుకోండి: