ఇకపోతే ఇటీవలే భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య వన్డే సిరీస్లో భాగంగా తొలి వన్డే మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఈ వన్డే మ్యాచ్లో ఏకంగా 31 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా జట్టు విజయం సాధించింది. అయితే దక్షిణాఫ్రికా జట్టు మొదటి వన్డే మ్యాచ్ లో విజయం సాధించడంలో కెప్టెన్ బావుమా, వండర్స్ డస్సేన్ కీలక పాత్ర వహించారు. ఇద్దరు కలిసి ఏకంగా నాలుగో వికెట్కు 204 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం అటు సౌత్ఆఫ్రికా జట్టుకు ఎంతగానో కలిసి వచ్చింది అని చెప్పాలి. ముఖ్యంగా కెప్టెన్ బావుమా సెంచరీతో అదరగొట్టాడు.
అయితే దక్షిణాఫ్రికా లో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న బావుమా సెంచరీ చేసి దాదాపు నాలుగేళ్లు అవుతోంది. ఏకంగా 2016 నుంచి తొలిసారిగా సెంచరీ నమోదు చేసి అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే కెప్టెన్ బావుమా మాతోపాటు వండర్ డస్సేన్ కూడా సెంచరీతో చెలరేగాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేయగలిగింది సౌతాఫ్రికా జట్టు. ఈ క్రమంలోనే భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 265 పరుగులు మాత్రమే చేసింది. దీంతో ఇక చివరికి సౌత్ ఆఫ్రికా జట్టు 31 పరుగుల తేడాతో విజయం సాధించడం గమనార్హం.