ప్రస్తుతం భారత క్రికెట్ లో ఉన్న యువ ఆటగాళ్లలో సంజు శాంసన్ మంచి టెక్నిక్ బ్యాట్స్మెన్ అన్న విషయం తెలిసిందే  ఇక అతని బ్యాటింగ్ చేసే విధానం కూడా ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది. కానీ నిలకడ లేమీ కారణంగా అతను టీమిండియాలో సరైన అవకాశాలు తప్పించుకోలేక పోయాడు. కానీ ఈ ఏడాది ఐ పి ఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా మాత్రమే కాదు ఒక ఆటగాడిగా కూడా తనను తాను నిరూపించుకున్నాడు. ఈక్రమంలోనే ఇక ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన టీం ఇండియా జట్టుకు ఎంపికయ్యాడు అన్న విషయం తెలిసిందే. అయితే టీమిండియాలో అయితే అవకాశం దక్కించుకున్నాడు కానీ తుది జట్టులో చోటు దక్కుతుందా లేదా అని  అందరు అనుకున్నారు.


 ఆ సమయంలోనే సంజు శాంసన్ కి అటు రెండవ టీ 20 మ్యాచ్ లో తుది జట్టులో అవకాశం దక్కింది అని చెప్పాలి. టీమిండియా జట్టులో కీలక ఓపెనర్ గా ఉన్న రుతురాజ్  గాయపడటంతో చివరికి అతని స్థానంలో జట్టులో అవకాశం దక్కించుకున్నాడు. ఇక  వచ్చిన అవకాశాన్ని ఎంతోబాగా సద్వినియోగం చేసుకున్నారడు అని చెప్పాలి. 77 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 9 ఫోర్లు 4 సిక్సర్లతో చెలరేగిపోయిన 42 బంతుల్లో 77 పరుగులు సాధించాడు.. అయితే సంజూ శాంసన్ రీఎంట్రీ అభిమానులు ఎంతో ఖుషి అయ్యారో చెప్పేందుకు నిదర్శనంగా ఒక వీడియో వైరల్ గా మారిపోయింది.


 2 టి20 లో టాస్ గెలిచిన తర్వాత హార్దిక్ పాండ్యా మాట్లాడాడు. ఈ సందర్భంగా మూడు మార్పులతో బరిలోకి దిగినట్లు హార్థిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.  అయితే గాయపడిన రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో సంజు శాంసన్ రీ ఎంట్రీ ఇస్తున్నాడు అనగానే మైదానంలో ప్రేక్షకులు అందరూ గట్టిగా అరుస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా సంజు సంజు అంటూ నినాదాలు చేశారు. ఇక ఇలా ప్రేక్షకుల అరవడం పై స్పందించిన హార్దిక్ పాండ్యా సంజూ పేరు వినగానే అందరూ హ్యాపీ అయి ఉంటారు అంటూ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: