నిన్న మ్యాచ్ లో ఆడి రేపు సిరీస్ ఆడనున్న వారు తమకు తగిలిన పరాభవానికి బదులు తీర్చుకుంటుందా అన్నది చూడాలి. సొంత గడ్డపై ఇంగ్లాండ్ ను ఏ ఫార్మాట్ లో అయినా ఓడించడం అంత ఈజీ కాదు. కానీ వారిని ఓడించాలంటే వారికి అలవాటు అయిన దూకుడు పద్దతిలోనే దెబ్బ కొట్టాలి. రేపటి నుండి టీ 20 సిరీస్ ప్రారంభం అవుతుంది. అందులో గెలవాలి అంటే సరైన ప్రణాలికను రెడీ చేసుకోవాలి. ఆఖరి టెస్ట్ కు గాయం కారణంగా దూరం అయిన రోహిత్ శర్మ తిరిగి జట్టు కెప్టెన్సీ ని అందుకోనున్నాడు. ఇక రాహుల్ గైర్హాజరీలో హార్దిక్ పాండ్య వైస్ కెప్టెన్ గా ఉంటాడు.
మొదటి మ్యాచ్ ను గెలిచి ఇంగ్లాండ్ పై ఒత్తిడి తీసుకురావాలి. అప్పుడే సిరీస్ ను గెలవడానికి సాధ్యం అవుతుంది. ఐపీఎల్ లో ఫామ్ కోల్పోయిన రోహిత్ శర్మ, రుతురాజ్ లు తిరిగి ఫామ్ ను దొరకబుచ్చుకుంటే ఇండియాకు తిరుగుండదు. ఇక ఎప్పటిలాగే సూర్య కుమార్ యాదవ్, దీపక్ హూడా, హార్దిక్ పాండ్య మరియు దినేష్ కార్తీక్ లు ఆడితే గెలుపు లాంఛనమే. మరి ఏమి జరుగుతుంది అనేది చూడాలి.