అయితే ఇటీవలే గాయం నుంచి కోలుకున్న వాషింగ్టన్ సుందర్ మరోసారి గాయం బారిన పడ్డాడు అన్నది తెలుస్తుంది. వొర్సిస్టెర్ షైర్ తో జరిగిన మ్యాచ్ లో క్యాచ్ పట్టేందుకు డైవ్ చేసిన సమయం లో ఎడమ భుజానికి గాయమైంది. దీంతో నొప్పి తో అతడు మైదానం వీడాడు. మళ్లీ గ్రౌండ్ లోకి రాలేదు. హాంప్షైర్ తో జరిగిన మ్యాచ్ లో కూడా అతను జట్టులో లేడు. ఈ క్రమంలోనే అతని గాయం తీవ్రమైంది అనేది తెలుస్తుంది. అయితే ఇటీవల జింబాబ్వే పర్యటనకు వెళ్లాడు.
ఇక అటు నుంచి నేరుగా బెంగళూరు లోని జాతీయ క్రికెట్ అకాడమీకి వాషింగ్టన్ సుందర్ వచ్చే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. నేషనల్ క్రికెట్ అకాడమీ లోని పునరావాస శిబిరాల్లో పాల్గొనే అవకాశం ఉంది అని తెలుస్తుంది. కాగా ఈ నెల 18 నుంచి హరారే వేదిక జింబాబ్వే తో మూడు వన్డేల సిరీస్ ఆడబోతుంది టీమిండియా. కేఎల్ రాహుల్ కెప్టెన్సీ లో బరిలోకి దిగ బోతోంది. దీంతో ఇక జింబాబ్వే పర్యటనకు కూడా వాషింగ్టన్ సుందర్ దూరమయ్యే అవకాశం ఉంది.