కాగా ఇప్పటికే భారత జట్టు జింబాబ్వే పర్యటనలో అడుగుపెట్టబోతోంది అన్న విషయం తెలిసిందే అయితే కేఎల్ రాహుల్ జట్టులోకి వచ్చిన నేపథ్యంలో ఒక ఆటగాడికి అవకాశం ఉంటుందా లేదా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఇటీవలే ముగిసిన వెస్టిండీస్ పర్యటనలో భాగంగా అద్భుతమైన ప్రదర్శన తో ఆకట్టుకున్నాడు శుభమాన్ గిల్. సాధారణంగా ఎప్పుడూ ఓపెనర్లుగా బరిలోకి దిగుతు ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఏ స్థానంలో వస్తాడు అన్నది ప్రశ్నార్థకంగా మారిపోయింది. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా మూడు మ్యాచ్లు ఆడిన శుభమాన్ గిల్ 205 పరుగులు చేశాడు.
ఈ క్రమంలోనే టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పై మాజీ ఆటగాడు దేవాంగ్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జింబాబ్వేతో వన్డే సిరీస్లో శుభమాన్ గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చే అవకాశం ఉందని తెలిపాడు. శుభమాన్ గిల్ కు రానున్న రోజుల్లో భారత జట్టు మేనేజ్మెంట్ మరింత అవకాశాలు ఇస్తుందని భావిస్తున్న.. ఎందుకంటే అతడు వచ్చే ఏడాది జరుగనున్న వన్డే వరల్డ్ కప్ లో భారత ప్రణాళికలో భాగంగానే ఉన్నాడు. అయితే విండిస్ గడ్డపై అతను బాగా రాణించినప్పటికీ జింబాబ్వే పర్యటనలో మాత్రం అతనికి ఓపెనర్గా స్థానం దక్కదు. ఇక గత కొంతకాలం జట్టుకు దూరంగా ఉన్న కె.ఎల్.రావు మళ్లీ తన ఫామ్ పొందాలంటే జింబాబ్వే పర్యటన ఎంతో ముఖ్యం అంటూ చెప్పుకొచ్చాడు.