ఐపీఎల్ వేలం చరిత్రలో చాలా ఎక్కువ రేటుకి అమ్ముడైన ఆటగాడిగా ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కరన్ నిలిచాడు. కొచ్చిలో జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో  పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.18.50 కోట్లకు కొనుగోలు చేసింది.సామ్ కరన్ బేస్ ధర రూ.2 కోట్లు అంటే ధర కంటే 9 రెట్లు ఎక్కువ ధర పొందాడు.ఇతను అంతకుముందు 2020, 2021లో చెన్నైలో ఉన్నారు. 2021లో చెన్నై ఐపీఎల్ టైటిల్ గెలుచుకోగా అందులో సామ్ కరన్ చాలా ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఆ సీజన్‌లో సామ్ కరన్ తొమ్మిది మ్యాచ్‌లు ఆడాడు. మొత్తం 56 పరుగులతో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. ఇతను మూడు ఐపీఎల్ సీజన్లలో 32 మ్యాచ్‌లలో రెండు అర్ధ సెంచరీలతో మొత్తం 337 పరుగులు చేశాడు. అదే సమయంలో సామ్ కరన్ పేరు మీద 32 వికెట్లు కూడా పడ్డాయి.


సామ్ కరన్ గొప్ప ఆల్ రౌండర్. అతను బ్యాట్‌తో చాలా స్పీడ్ గా పరుగులు సాధించగలడు. ఇంకా అలాగే బౌలింగ్‌తో కూడా చాలా అద్భుతాలు చేయగలడు. కొత్త బంతితో అద్భుతాలు చేసే సత్తా ఉన్న సామ్  డెత్ ఓవర్లలో కూడా ఈజీగా పరుగులు ఆపగలడు. లోయర్ ఆర్డర్‌లో చాలా స్పీడ్ గా పరుగులు సాధించగల సత్తా  ఉంది.రీసెంట్ గా ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను ఇంగ్లండ్ గెలుచుకోగా అందులో సామ్ కరన్ చాలా ముఖ్యమైన పాత్ర పోషించాడు.ఈ ప్రపంచకప్‌లో సామ్ కరన్ ఏకంగా 13 వికెట్లు తీసి సూపర్ అనిపించాడు.


ఇక ఐపీఎల్ వేలం చరిత్రలో మరో రికార్డు కూడా నెలకొంది. వెస్టిండీస్‌కు చెందిన నికోలస్ పూరన్ ఇప్పటి దాకా అత్యంత ఖరీదైన వికెట్ కీపర్‌గా నిలిచాడు.అతన్ని ఏకంగా రూ. 16 కోట్లకు హైదరాబాద్ కొనుగోలు చేసింది. అంతకుముందు అత్యధిక పారితోషికం అందుకున్న వికెట్ కీపర్ గా ముంబై ఆటగాడు అయిన ఇషాన్ కిషన్ మొత్తం 15.25 కోట్లతో నిలిచాడు.బౌలింగ్ ఆల్‌రౌండర్లు చాలా ఎక్కువ ధర పలికారు. ఈ ఆల్ రౌండర్లు కేవలం 30 నిమిషాల్లో రూ. 59 కోట్లు వసూలు చేశారు. ఐపీఎల్‌లోని 10 జట్ల వద్ద ఏకంగా 206.5 కోట్లు ఉన్నాయి. ఇందులో ఇప్పటి దాకా 10 మంది ఆటగాళ్లకు మొత్తం 83 కోట్లు ఖర్చు చేశారు. 87 మంది ఆటగాళ్లను కొనాల్సి ఉండగా మొత్తం 405 మంది ఆటగాళ్లను వేలం వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: