గత రెండు సీజన్ ల నుండి ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్ గా వికెట్ కీపర్ మరియు బ్యాట్స్మన్ రిషబ్ పంత్ ఉన్న విషయం తెలిసిందే. అంతకు ముందు 2020 సీజన్ లో మాత్రం శ్రేయాస్ అయ్యర్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా జట్టును సమర్థవంతంగానే ముందుకు నడిపించాడు. ఆ తర్వాత సీజన్ కు గాయం కారణంగా దూరం కావడంతో జట్టు పగ్గాలను టీం యాజమాన్యం వికెట్ కీపర్ మరియు బ్యాట్స్మన్ పంత్ కు అప్పగించారు. రిషబ్ పంత్ గత రెండు సీజన్ లకు కెప్టెన్ గా వ్యవహరించి జట్టును సక్సెస్ ఫుల్ గా నడిపించాడు.

ఈ రెండు సీజన్ లలో ఢిల్లీ క్యాపిటల్స్ మొత్తం 30 మ్యాచ్ లు ఆడగా , 16 మ్యాచ్ లలో విజయం సాధించి.. 13 మ్యాచ్ లు ఓడిపోయి ఒక మ్యాచ్ ను డ్రా గా ముగించింది. అలా రిషబ్ పంత్ కెప్టెన్ గా విజయాల శాతం 55 గా ఉంది. ఇక రాబోయే సీజన్ లో ఖచ్చితంగా టైటిల్ ను సాధిస్తాము అన్న కసితో ఉండగా ఇంతలోనే పంత్ కు కార్ యాక్సిడెంట్ జరిగింది. ప్రాణాపాయం లేకపోయినప్పటికీ మళ్ళీ యధావిధిగా కోలుకోవడానికి ఎనిమిది నెలల సమయం పడుతుందని డాక్టర్లు సూచించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం షాక్ తింది. దానితో ఈ సీజన్ లో షెల్లీ క్యాపిటల్స్ ను ముందుండి నడిపించే ఆటగాడు ఎవరన్న విషయం హాట్ టాపిక్ అయింది.

సీజన్ దగ్గర పడుతుండడంతో ఈ విషయంలో జట్టు యాజమాన్యం మరియు కోచింగ్ స్టాఫ్ అందరూ ఒక నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో సన్ రైజర్స్ కు మొదటి కెప్టెన్ గా వ్యవహరించిన సీజన్ లోనే టైటిల్ ను సాధించి రికార్డ్ సృష్టించాడు. అందుకే అతనిపై నమ్మకం ఉంచిన ఫ్రాంచైజీ ఓనర్స్ డేవిడ్ వార్నర్ ను జట్టుకు కెప్టెన్ గా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇన్నాళ్లకు మళ్ళీ వేరే ఫ్రాంచైజీకి డేవిడ్ వార్నర్ కెప్టెన్ గా చేయనున్నాడు. బ్యాటింగ్ లో వార్నర్ ఎంత డేంజరస్ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి మళ్ళీ వార్నర్ మ్యాజిక్ చేసి ఢిల్లీ క్యాపిటల్స్ కు టైటిల్ ను అందిస్తాడా చూడాలి.    


మరింత సమాచారం తెలుసుకోండి: