
అవును, అతడు మరెవరో కాదు శ్రీలంక స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్. ఈ విషయాన్ని సెహ్వాగ్ స్వయం గా చెప్పడం ఇపుడు ప్రత్యేకత సంతరించుకుంది. మురళీధరన్ అంటే తనకు భయమని.. పరుగులు తీసేందుకు ఇబ్బంది పడే వాడినని తాజాగా వెల్లడించాడు. బ్రేక్ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ షోలో సెహ్వాగ్ మాట్లాడుతూ "నాకు ముత్తయ్య మురళీధరన్ అంటే భయం. అతడు విసిరిన బంతులు ఇబ్బంది పెట్టేవి. అతని బౌలింగ్ లో ఎలా పరుగులు తీయడం నాకు కష్టంగా ఉండేది. మురళీ ధరన్ బౌలింగ్ లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడే వాడిని." అంటూ చెప్పుకొచ్చాడు.
తన క్రికెట్ జీవితం కాలం లో షేన్ వార్న్, షోయబ్ అక్తర్, బ్రెట్ లీ, గ్లెన్ మెక్ గ్రాత్ లకు కూడా వీరేంద్ర ఎప్పుడూ భయపడ లేదట. ఇకపోతే, ప్రపంచం లో అత్యంత విజయ వంతమైన స్పిన్నర్ ముత్తయ్య మురళీ ధరన్ అనే సంగతి అందరికీ విదితమే. రెండు ఫార్మాట్లలో శ్రీలంకకు తిరుగులేని విజయాలను అందించడం లో కీలక పాత్ర పోషించాడు. 800 టెస్టు వికెట్లు, 534 వన్డే వికెట్లతో ప్రపంచంలోనే నెం.1 బౌలర్గా ఉన్నాడు. ఏ ఇతర బౌలర్ కూడా అతని దరిదాపుల్లో కూడా లేకపోవడం కొసమెరుపు.