ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మనిషిలో విచక్షణ జ్ఞానం అనేది రోజురోజుకు కనుమరుగైపోతుందేమో అనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది అని చెప్పాలి  ఎందుకంటే ఒకప్పుడు ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలి.. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అని విచక్షణ కలిగి ఉండేవారు మనుషులు. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి విచక్షణ ఎవరిలో కనిపించడం లేదు. ఎందుకంటే ఏ సమస్యను ఎలా ఎదుర్కోవాలని ఎవరూ ఆలోచించడం లేదు. ఏ చిన్న సమస్య వచ్చినా పరిష్కారం ఒక్కటే ఆత్మహత్య అనే విధంగా మనిషి ఆలోచన శైలి మారిపోతుంది.


 ఇది ఎవరో చెప్పడం కాదు నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలే చెప్పకనే చెబుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఎందుకంటే చిన్న చిన్న కారణాలకే ఎంతోమంది కఠిన నిర్ణయాలు తీసుకుంటూ బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకు వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. ఎంతోమంది క్షణికావేశంలో విచక్షణ రహితమైన నిర్ణయాలు తీసుకుంటూ నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తూ ఉన్నారు. చిన్నారుల దగ్గర నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు  ఇలాగె ఆలోచిస్తూ ఉండడం అందరిని షాక్ కి గురిచేస్తుంది అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది.


 హైదరాబాద్ శివారులో యువకుడు ప్రాణ భయంతో చివరికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తనకు గుండెపోటు ఉందేమో అనే భయంతో క్షణికావేషంలో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. హైదరాబాద్ శివారులో ఉన్న శంకర్పల్లిలో ఈ ఘటన జరిగింది. చండిప్ప గ్రామానికి చెందిన కడకంచి విద్యాసాగర్, లలిత దంపతుల రెండవ కుమారుడు హరికృష్ణ దుందిగల్ లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అయితే గత మూడు ఏళ్ల నుంచి హరికృష్ణ గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నాడు. అయితే గుండెపోటు వచ్చి ప్రాణం పోతుందేమో అనే భయంతో చివరికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: