ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా మూడు ఫార్మట్లలో కూడా సిరీస్ లు ఆడుతుంది టీమ్ ఇండియా. ఈ క్రమంలోనే వెస్టిండీస్ పర్యటన టెస్ట్ సిరీస్ ద్వారా ప్రారంభించింది అన్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఆతిధ్య వెస్టిండీస్ తో రెండు మ్యాచ్లు టెస్ట్ సిరీస్ ఆడుతుంది. కాగా ఇప్పటికే మొదటి టెస్ట్ మ్యాచ్ ముగిసింది. అయితే ఈ మొదటి టెస్ట్ మ్యాచ్ లో భాగంగా టీమ్ ఇండియా ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది అని చెప్పాలి. ఒకవైపు బౌలర్లు వెస్టిండీస్ బ్యాటింగ్ విభాగంతో చెడుగుడు ఆడేశారు. ఇంకోవైపు బ్యాట్స్మెన్లు ఇక వెస్టిండీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు.


 ఇక ఫీల్డింగ్  లో కూడా భారత ఆటగాళ్లు అద్భుతమైన క్యాచ్లు పట్టి ఔరా అనిపించారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే మొదటి మ్యాచ్ లో ఏకంగా ఒక ఇన్నింగ్స్ తేడాతో భారీ విజయాన్ని అందుకుంది టీమిండియా. కాగా సొంత గడ్డపై అటు వెస్టిండీస్ దారుణమైన ప్రదర్శన చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయని చెప్పాలి. ఓడిపోవడం కాదు కనీసం టీమ్ ఇండియాకు సరైన పోటీ కూడా ఇవ్వలేకపోయారు అంటూ ఎంతో మంది వెస్టిండీస్ మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు అని చెప్పాలి.


 అయితే టీమిండియా చేతిలో తొలి టెస్ట్ మ్యాచ్లో దారుణంగా ఓడిపోవడం గురించి ఆ జట్టు కెప్టెన్ బ్రాత్ వైట్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టు బ్యాట్స్మెన్ ల వైఫల్యం కారణంగానే ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటూ చెప్పుకొచ్చాడు. పిచ్ పూర్తిగా స్పిన్నర్లకు అనుకూలించడంతో భారత బౌలర్లు అశ్విన్, జడేజా బౌలింగ్ ఎదుర్కోవడం ఎంతో కష్టంగా మారిపోయింది అంటూ తెలిపాడు. అయితే తాను కూడా పరుగులు రాబట్టడం విషయంలో విఫలమయ్యాను అంటూ కెప్టెన్ బ్రాత్ వైట్ తెలిపాడు. ఇక ఈ మ్యాచ్ కోసం స్టేడియం కు వచ్చి తమకు మద్దతు తెలిపిన ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు అంటూ చెప్పాడు. రెండు టెస్ట్ మ్యాచ్ లో తప్పులను సరిచేసుకుని బరిలోకి దిగుతాం అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: