విరాట్ కోహ్లీ గురించి ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ఎందుకంటే వరల్డ్ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ ఆటగాళ్ల లిస్ట్ తీసినప్పుడల్లా విరాట్ కోహ్లీ పేరు మొదటి వరుసలో వినిపిస్తూ ఉంటుంది. ఇక తన అటతీరుతో అంతలా ప్రపంచ క్రికెట్లో గుర్తింపున సంపాదించుకున్నాడు ఈ టీమిండియా స్టార్ ప్లేయర్. అయితే కేవలం ఆటగాడిగా మాత్రమే కాకుండా కెప్టెన్ గా కూడా అతను భారత క్రికెట్ లో ఎన్నో సేవలు అందించాడు అన్న విషయం తెలిసిందే.


 రికార్డుల విషయంలో విరాట్ కోహ్లీ తోపు అతనికి ఎవరు సాటి లేరు అన్న విషయాన్ని ఒకరు, ఇద్దరు చెప్పడం కాదు క్రికెట్ ప్రపంచం మొత్తం ముక్తకంఠంతో చెబుతుంది. ఎందుకంటే నేటి తరంలో ఎంతోమంది సార్ క్రికెటర్లు ఉన్న ఇక కోహ్లీకి రికార్డులలో పోటీ ఇచ్చే క్రికెటర్ మాత్రం ఎవ్వరు లేరు. ఇక సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకోవడంలోనూ విరాట్ కోహ్లీ తనకు ఎవరు సాటిరారు అన్న విషయాన్ని నిరూపించారు. ఇలా ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాడిగా ఇక భారత జట్టుకు వెన్నుముకగా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ.. సింప్లిసిటీ మాత్రం ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది.


 అతని సింప్లిసిటీకి ఫ్యాన్స్ అందరూ కూడా ఫిదా అయిపోతున్నారు. ఇటీవల వెస్టిండీస్ తో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో విరాట్ కోహ్లీ లాంటి ఒక స్టార్ క్రికెటర్ ఏకంగా డ్రింక్స్ బాయ్ అవతారం ఎత్తాడు. సాదరణంగా డ్రింక్స్ బాయ్స్ గా యంగ్ క్రికెటర్లు కనిపించడం చూస్తూ ఉంటాం. కానీ కోహ్లీ లాంటి అద్భుతమైన ప్లేయర్ ఇక మ్యాచ్ కి మేనేజ్మెంట్ రెస్ట్ ఇవ్వడంతో చాహాల్ తో కలిసి గ్రౌండ్లోని ఆటగాళ్లకు డ్రింక్స్ తీసుకెళ్తూ డ్రింక్స్ బాయ్ గా మారిపోయాడు. తాను స్టార్ క్రికెటర్.. రికార్డుల రారాజుని అన్న గర్వం విరాట్ కోహ్లీ లో ఎక్కడ కనిపించలేదు. వరల్డ్ లోనే అత్యుత్తమ ప్లేయర్ అయినప్పటికీ ఒక సాదాసీదా యువకుడిలా.. విరాట్ కోహ్లీ డ్రింక్స్ తీసుకెళ్లడం చూసి అతని సింప్లిసిటీకి హాట్సాఫ్ చెబుతున్నారు ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: