నిన్న అనగా మార్చి 30 వ తేదీన ఐ పీ ఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) లో భాగంగా బెంగళూరు రాయల్ చాలెంజర్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ కి మధ్య మ్యాచ్ జరిగింది. ఇక మొదటి నుండి పాత సమీకరణాలను చూసినట్లు అయితే బెంగళూరు పై కోల్కతా నైట్ రైడర్స్ కాస్త పై చేయి అని చూపిస్తూనే వస్తుంది. అలా మొదటి నుండి పాజిటివ్ వైబ్ తో మ్యాచ్ లోకి దిగిన కోల్కతా నిన్న మ్యాచ్ లో కూడా విజయాన్ని సాధించింది.

ఇకపోతే మొదట నిన్నటి మ్యాచ్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ బ్యాటింగ్ ను చేసింది. అందులో భాగంగా 20 ఓవర్లు ముగిసే సరికి ఆరు వికెట్ లను కోల్పోయి 182 పరుగులను చేసింది. ఇకపోతే కోల్కతా నైట్ రైడర్స్ 183 పరుగుల భారీ లక్ష్యం తో బరిలోకి దిగింది. ఇకపోతే ఈ జట్టు చాలా స్పీడ్ గా పరుగులను పూర్తి చేస్తూ వచ్చింది. దానితో కేవలం 16.5 ఓవర్ లలోనే కేవలం 3 వికెట్ లను కోల్పోయి కోల్కతా జట్టు 186 పరుగులను చేసి విజయాన్ని దక్కించుకుంది.

ఇలా బెంగళూరు నిన్న ఓడిపోవడం పై గవాస్కర్ స్పందించాడు ... విరాట్ కోహ్లీ ఒక్కడే ఎంత అని ఆడతాడు మీరే చెప్పండి. ఎవరైనా అతనితో నిలబడాలి. నిన్న జరిగిన "కే కే ఆర్" మ్యాచ్ లో కూడా ఏ ఆటగాడు అయినా కోహ్లీ తో కలిసి చాలా సేపు ఆట ఆడి ఉంటే అతను 83 పరుగులకు బదులు 120 పరుగులు చేసి ఉండేవాడు. టీమ్ అంత కలసికట్టుగా ఆడవలసిన గేమ్ ఇది. ఒక్కడే ఆడవలసిన ఆట కాదు. ఈ రోజు ఒక్క ప్లేయర్ అయిన విరాట్ కి సపోర్ట్ ఇచ్చి ఉంటే బెంగళూరు టీం కచ్చితంగా విజయాన్ని సాధించేది అని గవాస్కర్ స్పందించాడు. ఇక తాజాగా గవాస్కర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: