బడ్జెట్​ ధరల్లో స్మార్ట్​ఫోన్లు అందించే చైనా దిగ్గజ సంస్థ షియోమీ నుంచి త్వరలో మరో కొత్త మొబైల్​ రాబోతుంది. వెనుక వైపు ఐదు కెమెరాలతో రూపొందించిన ఎంఐ సీసీ9 ప్రో స్మార్ట్ ​ఫోన్​ను నవంబర్ ​5 న విడుదల చేసేందుకు షియోమీ సిద్ధమైంది. సీసీ9 ప్రోకు సంబంధించి పూర్తి ఫీచర్లను షియోమీ వెల్లడించలేదు. మీటూ సంస్థ భాగస్వామ్యంలో వచ్చిన సీసీ స్మార్ట్​ ఫోన్ల సిరీస్​ లో సీసీ9 ప్రో మూడోది. ఇప్పటి వరకు ఈ సిరీస్​లో సీసీ9, సీసీ9 ఈ ఫోన్లను షియోమీ విడుదల చేసింది.


సీసీ9ఈ ను ప్రపంచ మార్కెట్లో ఎంఐ ఏ3 ఆండ్రాయిడ్​ వన్​ పేరుతో విడుదల చేసింది. సీసీ9 ప్రోను ఏ3 ప్రోగా విడుదల చేయనున్నట్లు సమాచారం. 6జీబీ ర్యామ్​ - 128 జీబీ రామ్​, 8 జీబీ ర్యామ్ ​- 128జీబీ రామ్​, 8జీబీ ర్యామ్ ​- 256 జీబీ వేరియంట్లలో లభించనుంది.


ఇది ఇలా ఉండగా అధికారిక సమాచారం ప్రకారం సీసీ9 ప్రోలో కెమెరా పై షియోమీ ప్రధానంగా దృష్టి సారించింది. వెనుకవైపు 5 కెమెరాలను ఇందులో పొందుపరిచింది. ప్రధాన కెమెరాలో శాం​సంగ్ రూపొందించిన 108 మెగాపిక్సల్​ సెన్సార్​ను అమర్చింది. ఫొటో బ్యాక్​గ్రౌండ్​ స్పష్టత కోసం 12 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్, 8ఎంపీ టెలిఫొటో లెన్స్​, మాక్రో లెన్స్, డెప్త్ సెన్సార్లనూ పొందుపరిచింది. ఒప్పో రెనో ఫోన్ల తరహాలో 5 రెట్లు ఆప్టికల్​ జూమ్​ ఆప్షన్​ కూడా షియోమీ ఇచ్చింది. మార్కెట్లో ప్రస్తుతానికి 5 కెమెరాలున్న స్మార్ట్​ ఫోన్​ నోకియా 9 ప్యూర్​వ్యూ మాత్రమే. 


ఇక ఏఏ ఫోన్ విషయానికి వస్తే ప్రత్యేకతలు ఏఏ విధంగా ఉన్నాయి. 6.4 అంగుళాల ఫుల్​ హెచ్​డీ అమోఎల్​ఈడీ తెర, క్వాల్​కమ్​ స్నాప్​డ్రాగన్​ 730జీ చిప్​సెట్, 108ఎంపీ వెనుక ప్రధాన కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, బ్యాటరీ సామర్థ్యం-4000 ఎంఏహెచ్ ఇక ధర విషయానికి వస్తే ధర రూ.16,000 నుంచి రూ.20,000 మధ్య ఉండొచ్చని మార్కెట్​ నిపుణుల అంచనా వేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: