దేశీయ ఇ-కామర్స్  దిగ్గజం ఫ్లిప్ కార్ట్ ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లతో తమ కష్టమర్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ప్రతిసారి ఫెస్టివల్ సీజన్స్ లో ఆఫర్స్ ను ప్రకటించి వినియోగ దారులను ఆకట్టుకునే ఫ్లిప్ కార్ట్ తాజాగా ఆన్ సీజన్ లో కూడా ఆఫర్స్ ను ప్రకటిస్తూ కస్టమర్లను తమ వైపు తిప్పుకుంటుంది. తాజాగా మే 17 నుండి ఫ్లిప్ కార్ట్ లో ఎలక్ట్రానిక్ సెల్ నడుస్తుంది. ఈ సెల్ మే 21 వరకు కొనసాగనుంది. మరి ఈ సెల్ లో టాప్ బ్రాండ్ మొబైల్స్ పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది ఫ్లిప్ కార్ట్.
రేడిమి, రియల్ మీ, శాంసంగ్ మోటోరోలా, పోకో వంటి టాప్ బ్రాండ్ లకు చెందిన ఫోన్లను భారీ డిస్కౌంట్ లో అమ్మకానికి ఉంచింది. 15 వేల నుండి 20 వేల లోపు బెస్ట్ మొబైల్ కోనాలి అనుకునే వారికి ఈ సెల్ అద్భుతమైన అవకాశం కల్పిస్తుంది. ఇక ఈ అమ్మకంలో హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ కార్డు దారులకు 12శాతం వరకు డిస్కౌంట్ ను అందిస్తుంది. వీటితో పాటుగా నో కాస్ట్ ఇఏంఐ, కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్, ఎక్స్ ఛేంజ్ ఆఫర్ వంటి వాటిని కూడా ఈ ఎలక్ట్రానిక్ సెల్ ద్వారా అందిస్తుంది. ఇక ఇటీవల విడుదల అయిన పోకో ఎక్స్3 ప్రొ ను కేవలం రూ.16,799/- లకే అందించనుంది. అలాగే పోకో ఎక్స్3 మొబైల్ ను రూ. 15,499 /- లకే పొందవచ్చు. 
ఇక బడ్జెట్ క్యాటగిరీలో బెస్ట్ అల్ రౌండర్ ఫోన్ గా నిలిచిన పోకో ఎమ్3 మొబైల్ రూ.10,999/- లకే అందుబాటులో ఉంది.ఇక శాంసంగ్ ఎఫ్12 మొబైల్ రూ.9,999/- లకే లబించనుంది. రియల్ మీ 8 మొబైల్ రూ.14,499/- లతో బెస్ట్ డీల్ గా ఉంది. ఇక ఇవే కాకుండా రియల్ మీ c12,c15,7,x75g,x7 pro 5g.. వంటి స్మార్ట్ ఫోన్ లపై కూడా భారీ డిస్కౌంట్ నడుస్తుంది. ఇక అంతే కాక హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్ వినియోగ దారులకు 12 శాతం తగ్గింపు కూడా వర్తిస్తుంది. మరో కొత్త మొబైల్ కోసం చూసే వారికి ఫ్లిప్ కార్ట్ లో నడుతున్న ఈ ఎలక్ట్రానిక్ సెల్ మంచి ఆప్షన్ అవుతుంది.  .

మరింత సమాచారం తెలుసుకోండి: