**ఈ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ పద్ధతి**
దీనికొరకు ప్రతి డీలర్ దుకాణంలో "పాయింట్ ఆఫ్ సేల్" పరికరాలను అందుబాటులో ఉంచారు. రైతు ఆధార్ కార్డు తీసుకు వచ్చి పిఓఎస్ పరికరంలో వేలి ముద్ర వేసి ఆన్ లైన్ ఎంటర్ చేసిన తర్వాత ఎరువులు ఇవ్వడం జరుగుతుందని, దీని ద్వారా ఇష్టరాజ్యాంగ అమ్ముకునే ఎరువులను అడ్డుకోవచ్చని తెలిపింది. ఇప్పటి వరకు రెండు లక్షల 26వేల పీఓఎస్ పరికరాలను అందుబాటులో ఉంచామని తెలిపింది. అంతేకాకుండా కొంతమంది రైతులు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి వాటిని స్టాక్ చేసుకొని మిగతా రైతులకు ఇబ్బంది చేస్తున్నారని అలా ఎక్కువ కొనుగోలు చేసిన టాప్ 20 మంది రైతులను మరియు తరచూ ఎరువులనుకొనే రైతుల జాబితాను తీసి మరలా వ్యవసాయ అధికారితో తనిఖీ చేసి ధృవీకరించడం జరుగు తుందన్నారు. రైతులు ఎరువులు కొన్న తర్వాత తన సెల్ ఫోన్ కి బిల్ నెంబర్, అలాగే డీలర్ పేరు, ఎంతకు కొన్నారు, డబ్బులు ఎంత చెల్లించారు, ప్రభుత్వం సబ్సిడీ ఎంత ఇచ్చిందో మనకి ఎస్ఎంఎస్ రూపంలో వస్తాయని తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి