కలుషిత ఆహారం వల్ల చిన్న వయసులోనే షుగర్ వచ్చిన యువతీ యువకులు చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పటివరకు షుగర్ చెక్ అప్ చేయించుకోవాలంటే కేవలం బ్లడ్ తోనే చెక్ చేసేవారు. అది కూడా మన శరీరంలో నుంచి కొంత రక్తాన్ని తీసుకొని చేయడం జరుగుతోంది. అయితే యువతీ యువకులకు అయితే ఇలాంటి సమస్య లేదు. వృద్ధులకు అయితే ఈ విషయం చాలా తలనొప్పిగా మారుతోంది.

అయితే తాజాగా అమెరికన్ శాస్త్రవేత్తలు వారి పరిశోధనలో ఒక డివైజ్ ను కనుగొన్నారు. ఆ డివైస్ తో ఎలాంటి రక్తం అవసరం లేకుండ మనకు షుగర్ ఉందో లేదో తెలియజేస్తోంది. అది ఎలాగంటే కేవలం మన శరీరం పైన వచ్చేటువంటి చెమట ఆధారంగా.. దేహం ఉండేటువంటి చక్కెర స్థాయిలను చూపిస్తుందట. ఈ పరికరాన్ని మనం చేతితో తాకవచ్చు.

ఈ పరికరాన్ని ఎక్కడైనా చేతిమీద ఉంచుకొని మన షుగర్ లెవెల్స్ ను చెక్ చేసుకోవచ్చు. అమెరికాలోని పెన్సిల్వేనియా అనే యూనివర్సిటీ లోని కొంతమంది పరిశోధకులు దీనిని పరిశీలించి సమాచారాన్ని తెలియజేశారు. దీనిని బయో సెన్సార్, బయో ఎలక్ట్రానిక్ వంటివాటితో నిర్మించారు. ఇక ఈ డివైస్ లో నికెల్ అనే మెటల్ ను ఉంచడంవల్ల, సులువుగా మన శరీరంలో ఉండేటువంటి చక్కెర స్థాయిని తెలియజేస్తుంది.

ఇక ఈ డివైస్ చేసేటప్పుడు బంగారాన్ని కూడా కొద్దిగా వినియోగించారట. వీటి కారణంగానే ఎవరికైనా అలర్జీ వచ్చే ప్రమాదం చాలా తక్కువ అని తెలియజేస్తున్నారు పరిశోధకులు. ఈ డివైజ్స్ రక్తం తో పోలిస్తే.. చెమటలోనే  గ్లూకోజ్ శాతాన్ని బాగా కరెక్ట్ గా చూపిస్తుందని పరిశోధకులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ డివైస్ లో ఎంజైమ్లు వంటి వాటిని ఉపయోగించకపోవడం వల్ల చర్మం దెబ్బతినకుండా  ఉంటుందని, చెప్పుకొస్తున్నారు పరిశోధకులు. దీనిని త్వరలోనే దేశమంతటా విస్తృతంగా చేస్తాయని పరిశోధకులు తెలియజేస్తున్నారు. అందుకు వైద్య ఆరోగ్య సహకారం అందించాలని చెప్పుకొస్తున్నారు పరిశోధకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: