వాతావరణ కాలుష్యాల వల్ల వాతావరణంలో జరిగే మార్పులతో సముద్రపు జలాలు ఎక్కువ శాతం పెరిగి పోయాయట.. అందుచేతనే దేశంలో ఉండే కొన్ని తీర ప్రాంతాలు మునిగిపోతాయని తెలియజేశారు. ఇక అలాంటి లిస్టులో ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి విశాఖపట్నం సిటీ కూడా ఉన్నది. అయితే సముద్రం అలా ఎంత ముందుకు వస్తే ఏ ఏ ప్రాంతాలు నీట మునుగుతాయో ఒకసారి తెలుసుకుందాం.
ప్రస్తుతం అయితే ఇప్పుడు ఎలాంటి ప్రమాదం లేదు కానీ.. దాదాపుగా 60 నుంచి 80 సంవత్సరాల తరువాత విశాఖపట్నం చెదిరిపోయే అవకాశం ఉన్నది. ప్రతి సంవత్సరం సముద్రపు జలాల ఎత్తు..0.2 సెంటీమీటర్లు నుంచి 0.5 సెంటి మీటర్ల ఎత్తు వరకు పెరుగుతూ ఉన్నదట.. కానీ ప్రస్తుతం 0.6 సెంటి మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుందట. రాబోయే రోజుల్లో ఇంకా 2 సెంటీమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.
2050 వ సంవత్సరం తర్వాత సముద్రపు చుట్టుకొలతలు పెరుగుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా , ఉష్ణోగ్రతలు ఎక్కువై మంచు కరగడం వల్ల ఆ నీరు సముద్రంలోకి కలిసి వాటి మట్టాన్ని పెంచుతాయట. అలా పెరిగే అవకాశం ఎక్కువగా మంగళూరు, చెన్నై, విశాఖపట్నం, ముంబై, పారాదీప్, ట్యూటీకొరిన్, ఖదీర్ పూర్ . వంటి నగరాలు ఎక్కువగా సముద్రంలో కలవనున్నట్లు సమాచారం.