మామూలు మొక్కలు మట్టిలోనె పెరుగుతాయి.. నీటిలో పెరిగే మొక్కలు కూడా కొంత భాగం మట్టిలోనే ఉంటుంది. మొక్కలు బాగా ఎదగాలి అంటే మట్టి తప్పనిసరిగా ఉండాలి..కొన్ని ప్రాంతాలలో మట్టి లేకుండా కూడా పండిస్తున్నారు.ఇదెలా అనే సందేహం అందరికి వస్తుంది.కానీ ఇప్పుడు టెక్నాలజీని వాడి మట్టి లేకుండా సేంద్రియ పద్దతిలో మొక్కలను నాటి అధిక లాభాలను పొందే వాళ్ళు రోజు రోజుకు పెరిగి పోతూన్నారు..ఇప్పుడు ఓ ఇంజినీర్ మట్టిలో పండే బంగాళదుంపలను గాలిలో కాసేలా చేసి అందరిచేత ఔరా అనిపించుకుంటున్నారు. మట్టి అవసరం లేకుండా డాబా మీద, గార్డెన్ లో పండిస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నారు..


అందరు అతన్ని ఆదర్శంగా తీసుకుంటున్నారు.ఆ మొక్కలను ఎలా చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుంటూన్నారు.ఇది నిజంగా గొప్ప కదా.. విషయాన్నికొస్తే.. సూరత్‌లోని అడాజన్ ప్రాంతంలో నివసించే సుభాష్ అనే వ్యక్తి ఓ ఇంజినీర్. అతనికి జాబ్ తో పాటు రకరకాల మొక్కలను ఇంటి ఆవరణంలో పెంచడం ఇష్టం. ప్రతి రోజూ మొక్కల పెంపకం పై కొంత సమయాన్ని కేటాయిస్తు దిగుబడిని పెంచే దిశగా అతను ఆలోచనలు చేస్తున్నారు.ఇక శని, ఆది వారాలలో పూర్తిగా మొక్కలను చూసుకుంటాడు..ఈ క్రమంలో కొత్త ఆలోచన చేశాడు.బంగాళదుంపలా కనిపించే ఓ దుంపను మట్టి అవసరం లేకుండా తీగపై పెరిగే మొక్కలను తెంచి పెంచుతున్నాడు.


అతను వివిధ ప్రాంతాలకు వెళ్ళడం అంటే సరదా..అలా ఓసారి సౌరాష్ట్రలోని గిర్ అడవులకు వెళ్ళినప్పుడు బంగాళాదుంప విత్తనాలను తీసుకొచ్చాడు. అవి గాలి పోటాటో..కొండల్లో, అడవుల్లో అవి తీగలాగ పెరుగుతాయి.ఈ పొటాటో వృక్షశాస్త్ర నామం డియోస్కోరియా బల్బిఫెరా.. గాలిలో పెరుగుతున్న ఈ బంగాళదుంపలను చూడటానికి జనం ఆసక్తి కనబరుస్తున్నారు. అతని ఇంటి వద్ద జనం క్యూ కడుతున్నారు..దాంతో బంగాళదుంపలకు డిమాండ్ కూడా భారీగా పెరిగింది. ఇవి రసాయన రహితంగా పెరుగుతాయి. సంవత్సరంలో చాలా సార్లు కాపు కాస్తాయి... వాటి రుచి బాగుండటంతో రోజు రోజుకు వీటిని కొనేవారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: