సాదారణంగా మందుబాబులు ఎలా ప్రవర్థిస్తారొ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మద్యం సేవిస్తే మెదడు పని చెయ్యదు..అప్పుడు మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా పోతుంది.. అందరి సంగతి పక్కన పెడితే, ఓ వ్యక్తి 20 ఏళ్లుగా మద్యం తాగుతున్నాడు. ఇటీవల ఒకరోజు మద్యం తాగాడు. ఆ మద్యం అతనికి కిక్ ఇవ్వలేదు. దాంతో అది నకిలీ మద్యం అని అధికారులకు, హోం మంత్రికి ఫిర్యాదు చేశాడు.. అంత మత్తులో కూడా అతని బ్రెయిన్ బాగా పని చేస్తుందని ప్రశంసలు కురిపించారు..ఇలా చాలా మంది జనాలు రకాల కామెంట్లు చేస్తున్నారు.


వివరాల్లొకి వెళితే...మధ్య ప్రదేశ్ లోని ఉజ్జయినిలోని బహుదూర్ గంజ్ ప్రాంతానికి చెందిన లోకేష్ సోథియా పెయిడ్ పార్కింగ్ స్టాండ్ నిర్వహిస్తూ ఉంటాడు. ఏప్రిల్ 12న స్ధానికంగా ఉన్నమద్యం దుకాణంలో నాలుగు సీల్డ్ క్వార్టర్ల స్వదేశీ మద్యం సీసాలు కొనుక్కున్నాడు. తర్వాత తన ఫ్రెండ్ తో కలిసి మందును తాగాడు.ఆ మద్యం కిక్ ఇవ్వలేదు. తనకు మద్యం మత్తు  ఇవ్వకపోవటంతో అది కల్తీ మద్యంగా భావించాడు. మద్యంలో నీళ్లు కలిపారని ఆరోపించాడు. మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రాతో పాటు ఉజ్జయిని ఎక్సైజ్ కమీషనర్ ఇందర్ సింగ్ దామోర్ కు ఈ విషయం పై కంప్లైంట్ చేశాడు..



మద్యం అమ్మిన షాపుపై వినియోగ దారుల కోర్టును కూడా ఆశ్రయించాడు. తాను గడిచిన 20 ఏళ్లుగా రోజు మద్యం సేవిస్తానని లోకేష్ సోథియా తెలిపాడు.. కల్తీ మద్యం అమ్మి జనాలను మోసం చేస్తున్న దుకాణ దారుల పై తక్షణం విచారణ జరపాలని కోరారు. అతని ఫిర్యాధు వల్ల చాలా మంది బయటకు వచ్చారు. ఇలా అడగడం తప్పు లేదు. మన హక్కులను గుర్తు చేశాను అంటూ అందరినీ పోగు చేశాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది.. సంచలనంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: