మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో మరో క్రైం కేసు వెలుగు చూసింది. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఓ బాలికపై చాలా దారుణంగా యాసిడ్‌ దాడికి పాల్పడ్డారు.దాంతో  ఆ 17 ఏళ్ల బాలిక చాలా తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆ బాలికని ఆస్పత్రిలో చేర్పించగా ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆమె ముఖంపై యాసిడ్‌ ఎక్కువగా పడటంతో కళ్లకు చాలా తీవ్రంగా గాయమైనట్టుగా ఆ బాలిక తండ్రి తెలిపాడు. ఈ ఘటనకు సంబంధించి ఆ ఇద్దరు అనుమానితులను గుర్తించామని, వారిలో ఒకరిని అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఇక ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ ఘటన అనేది జరిగింది. ఇక ఆ బాలికను సఫ్దర్‌గంజ్ ఆసుపత్రిలో చేర్చడం జరిగింది. ఢిల్లీ పోలీసు టీం కూడా ఆసుపత్రికి చేరుకుంది. ఆ ప్రాంతంలోని సీసీటీవీ కెమెరాలలో యాసిడ్‌ ఎటాక్‌ విజువల్ నమోదైంది.ఇక ఉదయం 9 గంటల ప్రాంతంలో మోహన్ గార్డెన్ సమీపంలో ఈ దారుణమైన ఘటన జరిగింది. 


ఆ ఇద్దరు విద్యార్థులు స్కూల్‌కి వెళ్లేందుకు అక్కడ వారు నిలబడి ఉండగా ముఖానికి ముసుగు ధరించి బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆ బాలికపై ఇలా యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఇక ఈ మేరకు స్థానికులు వెంటనే ఢిల్లీ పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ విద్యార్థిని వయస్సు వచ్చేసి 17 సంవత్సరాలు. ఆమె తన చెల్లెలితో కలిసి అక్కడ నిలబడి ఉంది. ఇక అంతలోనే బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు ఆమెపై యాసిడ్‌ ని విసిరారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ కూడా అక్కడ వెలుగులోకి వచ్చింది. ఇద్దరు అబ్బాయిలు బైక్‌పై వచ్చి ఆ విద్యార్థినిపై యాసిడ్‌ విసిరినట్లు ఆ ఫుటేజీలో కనిపిస్తోంది. ఆ యువకులిద్దరూ ముఖం కనిపించకుండా మాస్క్‌ వేసుకుని కూడా ఉన్నారు. ఆ తరువాత యువకులిద్దరూ బైక్‌పై పరారయ్యారు. ఒకడు దొరకగా ఇంకొక యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.ఇక ఆ బాధితురాలికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఆ విద్యార్థిని పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: