
మరొకవైపు వైయస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసి జైలులో పెట్టిన సిబిఐ ఇప్పుడు ఆయన కుమారుడు వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా గత కొద్ది రోజులుగా విచారిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆయనను కూడా త్వరలోనే అరెస్టు చేస్తున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి మరొకపక్క తెలంగాణలో వైఎస్ షర్మిల కూడా పోలీసుల నుంచి మాన్ హ్యాండిల్స్ ఎదుర్కొంది. అలాగే ఆమె కూడా ఇప్పుడు జైలు జీవితం గడుపుతోంది. మరొకపక్క వైఎస్ విజయమ్మ కూడా తనను తాకరాని చోట తాకుతున్నారని పోలీసులను చెంప దెబ్బలు కొట్టింది. ఇప్పుడు ఆమె కూడా శిక్ష అనుభవిస్తున్నట్లు సమాచారం.
ఇక ఆ కుటుంబ సభ్యులు అంతా కూడా ఒక్కొక్కరు ఒక్కో విధమైన చిక్కుల్లో పడ్డారని చెప్పవచ్చు. మరి ఇప్పటివరకు సీఎం జగన్ ఇంకా తన బాబాయి హత్య కేసు పైనే ఫోకస్ పెడుతున్నారు. కానీ మరొకవైపు చెల్లి, తల్లి పై జరుగుతున్న ఘోరాల గురించి ఆయన పట్టించుకోవడం లేదు. అయినా ఉన్నట్టుండి ప్రతి ఒక్కరు ఎందుకు ఇలా వైయస్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు అనేది అర్థం కావడం లేదు. మరొకవైపు ఇది చూసిన వారంతా వైయస్ జగన్ పాలన చరిత్రలో నిలిచిపోతుంది. ఆయన పాలనను చూసి కుళ్లుకున్న కొంతమంది వారి ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.