మహిళల రక్షణ కోసం చేపడుతున్న చట్టాలు, శిక్షలు కఠినతరం చేసినప్పటికీ పరిస్థితిలో మార్పు రావట్లేదు. సాటి ఉద్యోగి లైంగిక వేధింపులకు గురవుతుంటే చూసి ఆపకపొగ ఆమెను మానసికంగా హింసించి ఆమె మరణానికి కారకులయ్యారు కొందరు మహిళలు.
 హైదరాబాద్‌లోని మియాపూర్ బీహెచ్‌ఈఎల్ కాలనీలో ఈ విషాదం చోటు చేసుకుంది.  ఆత్మహత్యకు ముందు తనను వేధింపులకు గురి చేసిన అధికారి, తోటి ఉద్యోగుల పేర్లను సూసైడ్ లేఖలో పేర్కొంది.

రాజస్థాన్‌కు చెందిన నేహ అనే యువతీ 6 నెలల కిందటే బదిలీపై నగరానికి వచ్చింది.    నేహా బీహెచ్ఈఎల్‌లో అకౌంట్ విభాగంలో పని చేస్తోంది. ఆఫీసులో తన పైఅధికారి (డీజీఎం) కిషోర్ తనను లైంగికంగా వేధించేవాడని..పైగా ఫోన్‌ను హ్యాక్ చేసి బెదిరించాడని ఆమె తన సూసైడ్ లేఖలో పేర్కొంది.  తనపై డిజిఎం చేస్తున్న వేధింపులకు తోడు సహా ఉద్యోగులు మోహన్‌లాల్, సోని, స్వెన్, సీతారం, మహేశ్‌ కుమార్‌ తనపై అశ్లీల వ్యాఖ్యలు చేసేవారని లేఖలో రాసింది.


మరికొందరు మహిళలు నీలిమా, రుచితా, కల్పనా, స్వాతి మానసికంగా హింసించారని లేఖలో తెలిపింది. నాకు అనుక్షణం ప్రత్యక్షంగా పరోక్షంగా  నరకం చూపిస్తూ....నా జీవితాన్ని చీకటి మయం చేసారని తెలిపింది. జీవితాంతం తోడుతుంటా అని పెళ్లి చేసుకున్న నిన్ను వదిలి వెళ్లిపోతున్నా.... నన్ను క్షమించు అంటూ భర్తకు వీడ్కోలు పలికింది. ఇలా ఆఫీసులో తోటి ఉద్యోగలు వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన నేహ బుధవారం (అక్టోబర్ 16) రాత్రి మియాపూర్‌లోని భాను అపార్టుమెంట్‌లో తాను నివాసం ఉంటున్న గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. 

సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నేహ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: