కావాల్సిన పదార్థాలు:
చేపముక్కలు- ఐదు
కొబ్బరి పాలు- ఒకటిన్నర కప్పు
ఉల్లిపాయ పేస్ట్- అర కప్పు
జీలకర్ర- ఒక స్పూన్లు
నూనె- నాలుగు స్పూన్లు
ఉప్పు- రుచికి సరిపడా
అల్లం వెల్లుల్లి పేస్ట్- మూడు స్పూన్లు
పచ్చిమిర్చి పేస్ట్- మూడు స్పూన్లు
జీలకర్ర పొడి- రెండు టేబుల్ స్పూన్స్
కారం పొడి- రెండు టేబుల్ స్పూన్స్
పసుపు పొడి- అర టేబుల్ స్పూన్
గరం మసాలా పొడి- ఒక టేబుల్ స్పూన్
తయారీ విధానం:
ముందుగా చేప ముక్కలను నీటితో శుభ్రం చేసి గిన్నెలో వేసి అందులో కొద్దిగా పసుపు, ఉప్పు పట్టించి అరగంట పక్కన పెట్టుకోవాలి. అరగంట తర్వాత చేప ముక్కలను నూనెలో వేసి మరీ ఎక్కువగా కాకుండా.. దోరగా వేయించుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత చేపముక్కలను మరో ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్లో మరికొంచెం నూనె వేసి కాగిన తర్వాత జీలకర్ర, బిర్యానీ అకు వేసి నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులో ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు అందులోనే జీలకర్ర పొడి, కారం, వేసి కాసేపు వేయించాలి. కొద్దిసేపటి తర్వాత కొబ్బరి పాలను తీసుకొని ఆ మిశ్రమంలో పోస్తూ కలుపుకోవాలి. ఇప్పడు అందులో చేప ముక్కలు కూడా వేసి, తగినంత ఉప్పువేసి చేపముక్కలు పూర్తిగా ఉడికే వరకూ సన్నని మంట మీద ఉడికించుకోవాలి. చివరిగా అందులో గరం మసాలా పొడి, కొత్తిమీర వేసి స్టౌ ఆఫ్ చేస్తే సరిపోతుంది. అంతే టేస్టీ టేస్టీ కొబ్బరి పాలు ఫిష్ కర్రీ రెడీ. దీన్ని వేడి వేడిగా రైస్తో తింటే ఆహా.. ఏం రుచి.. తినరా మైమరిచి అని అనాల్సిందే..!