దేశంలో ఇప్పుడు ఎక్కడ చుసిన మహిళల పై జరుగుతున్న అత్యాచారాలగురించే చర్చ జరుగుతుంది. అత్యాచార ఘటనలు కేవలం మనదేశం లోనే కాదు ప్రపంచం మొత్తం ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయి. కానీ బయటకు వస్తున్నవి కొన్నే, పరువు కోసం బయటకు చెప్పుకోలేనివి పంచాయితీల్లో సెటిల్ అయ్యాయేవి కోకొల్లలు. తాజగా ఓ రియాల్టీ షోలో పాల్గొన్న ఓ కంటెస్టెంట్‌పై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. పైగా ఆ వీడియోను రికార్డ్ చేసి ఆమెకే చూపించారు. ఈ ఘటన స్పెయిన్‌లో చోటుచేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన బిగ్ బ్రదర్ రియాల్టీ షోలో ఈ ఘటన చోటుచేసుకుంది.


బిగ్ బ్రదర్ రియాల్టీ షో స్పెయిన్‌లో కూడా జరుగుతోంది. అక్కడ ఈ షోను ‘గ్రాన్ హర్మనో రెవల్యూషన్’ అంటారు. 2017లో జరిగిన ఈ షోలో కార్లోటా ప్రాడో అనే యువతి కూడా పాల్గొంది. ఈ షోలో ఆమెతో పాటు ప్రియుడు జోసా కూడా పాల్గొన్నాడు. అయితే రియాల్టీ షోలో భాగంగా బిగ్ బ్రదర్ హౌజ్‌లో పార్టీ జరిగింది. దాంతో అందరూ బాగా తాగి చిందులేశారు. ఆ తర్వాత స్పృహలేకుండా ఎలా పడితే అలా పడుకున్నారు. ఆ క్రమంలో కార్లోటా ప్రియుడు, స్నేహితుడు హౌజ్‌లోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఘటన అక్కడున్న సీసీ కెమెరాల్లోనూ రికార్డ్ అయింది.

అయితే మరుసటి రోజు బిగ్ బ్రదర్ హౌజ్‌లో కంటెస్టెంట్‌పై రేప్ జరిగిందని నిర్వాహకులకు తెలీడంతో నిందితుడు జోసాను హౌజ్‌ నుంచి పంపించేశారు. ఆ తర్వాత కార్లోటాను ఓ గదిలోకి తీసుకెళ్లి రేప్ జరిగినప్పుడు రికార్డ్ అయిన ఫుటేజ్‌ను చూపించారు. దాంతో ఆమె షాకయ్యారు. ‘ఇక ఆపండి’ అంటూ కేకలు వేశారు. ఆ వీడియో చూశాక ఆమె బోరున విలపించారు. ఆ తర్వాత జోసాను పోలీసులకు పట్టించారు. అయితే స్పానిష్ ప్రభుత్వం చట్టం ప్రకారం జోసా చేసింది పనిని అత్యాచారంగా పరిగణించలేమని వెల్లడించింది. ఈ ఘటన జరిగింది 2017లోనే అయినా ఇప్పటికీ ఈ ఘటనపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని కంపెనీలైతే ప్రచారం కోసం రేప్ ఫుటేజ్‌ను యాడ్స్ రూపంలో ప్రసారం చేశాయి కూడా. ఆ తర్వాత ఆ ఫుటేజ్‌ను పోలీసులకు అప్పగించారు. ఈ షోకు స్పాన్సర్లు రావడం మానేశారు. ఇంత జరుగుతున్నా పట్టించుకోని బిగ్ బద్రర్ నిర్వాహకులపై కేసు పెట్టాలని పెద్ద ఎత్తున ప్రజలు నిరసనలు తెలుపుతున్నారు.

బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి కూడా  బిగ్ బ్రదర్ ఐదో సిరీస్‌లో పాల్గొన్నారు. ఈ షోలో ఆమె ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. కంటెస్టెంట్లలో శిల్ప ఒక్కరే ఇండియన్. అదీకాకుండా ఆమె నల్లగా ఉన్నారని జాతి వివక్ష వ్యాఖ్యలు కూడా చేశారు. ఇవన్నీ తట్టుకుని ఆమె విన్నర్‌గా నిలిచారు. శిల్పా శెట్టిపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసినందుకు యూకే, భారత ప్రభుత్వాలు 2008లో జరగాల్సిన సీజన్‌ను సస్పెండ్ చేశాయి. ఆ తర్వాత షోలోని కంటెస్టెంట్స్ శిల్పా శెట్టికి క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత శిల్ప మీడియాతో మాట్లాడుతూ తనపై కామెంట్ చేసిన వారిని క్షమించానని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: