2019వ సంవత్సరంలో జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా లో జరిగిన ఉగ్రదాడి ని ఏ భారతీయుడు కూడా మర్చిపోలేడు. ప్రపంచం మొత్తాన్ని కలచివేసిన ఈ సంఘటన ఉగ్రవాద చర్యలకు పరాకాష్టగా మిగిలిపోగా ఎంతో మంది భారత జవాన్లు కి ఈ ఘటన లో అమరులయ్యారు. ఎన్నో కుటుంబాలకు ఆవేదనను మిగిల్చిన ఈ దాడి లో చనిపోయిన మేజర్ విభూతి శంకర్ దౌండియల్ భార్య నితిక కౌల్ నిన్న ఆర్మీ లో చేరారు. తన భర్త అడుగుజాడల్లో నడుస్తూ కమాండర్ గా బాధ్యతలు చేపట్టారు. నార్త్ ఆర్మీ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ వై కె జోషి ఆమె భుజంపై స్టార్స్ ని పెట్టారు.

తమిళనాడులోని చెన్నైలో ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ లో ఈ కార్యక్రమం జరిగింది. ఆమె తన కార్పొరేటు ఉద్యోగాన్ని వదిలి తన భర్తకు నివాళిగా షార్ట్ సర్వీస్ కమిషన్ పరీక్షలు క్లియర్ చేసి సైన్యంలో చేరారు నితిక. 2019 ఫిబ్రవరి లో కాశ్మీర్ లో పుల్వామా ఉగ్రదాడి లో మేజర్ శంకర్ ప్రాణాలు కోల్పోయారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేశారు. ఆయనకు అప్పటికీ పెళ్లై ఏడాది కూడా కాలేదు. చిన్న వయసులోనే భర్తను కోల్పోయినప్పటికీ దేశం కోసం తన భర్త ప్రాణాలు అర్పించారు అని గర్వంగా ఉందని తెలిపారు. ఇప్పుడు ఆయనపై ప్రేమ తో పాటు తాను కూడా ఆర్మీలో చేరి దేశ సేవ సిద్ధమయ్యారు. ఆర్మీలో చేరాలన్న ఆమె నిర్ణయాన్ని పలువురు అభినందిస్తున్నారు. అమరుడైన శంకర్ కు భారత ప్రభుత్వం శౌర్య చక్ర అవార్డు ను అందించింది.

ఈ సందర్భంగా పలువురు సైనికాధికారులు కూడా ఆమెను అభినందించారు. దేశం కోసం మేజర్ విభూతి దౌండియాల్ అత్యున్నత త్యాగం చేశారు ఈరోజు ఆయన భార్య నితిక సైనిక దుస్తులు ధరించి ఘన నివాళి అర్పించారు. ఇది ఆమెకు ఎంతో గర్వించదగ్గ క్షణమని ఉదంపూర్ ఉత్తర ట్వీట్ చేశారు. ని తి క అంకితభావం, దృఢనిశ్చయం, భారతీయం నారీశక్తికి మీరు ప్రతీక .. మీ భుజాలమీద సైనికాధికారులు స్టార్ లను చూసి మేజర్ విభూతి ఎంతో గర్విస్తూ ఉంటారు అని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా ప్రశంసించారు. నితికా చేసిన ఈ సాహసం ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తుంది అని సామాన్య ప్రజలు సైతం ప్రశంసిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: