బుల్లితెరపై ఈటీవిలో బుధవారం ప్రసారమవుతున్న ఢీ షో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. కంటెంట్స్ డాన్సులతో టీం లీడర్ల ఫన్నీ టాస్క్ లతో షో మంచి రేటింగ్ తో దూసుకెళ్తుంది. అయితే ఈ వారం ప్రోమోలో కొన్ని సన్నివేశాలు హైలేట్ గా నిలిచాయి. అవి ఏంటో ఒక్కసారి చూద్దామా. ఇక ప్రోమోలో ప్రదీప్‌ హాస్టల్‌ వార్డెన్‌గా... ఆ గర్ల్స్‌ హాస్టల్‌లో జాయిన్‌ అవ్వడానికి వచ్చిన అమ్మాయిల వలే రష్మీ, దీపిక, శర్వరీ, నైనికా... బాయ్స్‌ హాస్టల్‌లో జాయిన్‌ అవ్వడానికి వచ్చిన అబ్బాయిల వలే సుధీర్‌, ఆది, అజహర్‌ వస్తారు.

అయితే రష్మీ, దీపికలను పేర్లు చెప్పిన తర్వాత ‘వయసు?’ అని ప్రదీప్‌ అడుగుతాడు. రష్మీ ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే...’ అంటూ పాట పాడుతుంది. దాంతో ప్రదీప్ ‘పదహారు ఒకట్లా అమ్మా... పదహారు రెళ్లా?’ అని అడిగారు. దానికి సుధీర్ ‘పదహారు మూడ్లు వేసినా తప్పు లేదు సార్‌’ అని అన్నాడు. ఇక అదేంటో... రష్మీ వయసు మీద ఎన్నిసార్లు జోక్స్‌, సెటైర్స్‌ వేసినా పేలుతూ అందరిని నవ్విస్తూ ఉంటారు. కాగా.. చాలాసార్లు ఆమెను సీనియర్‌ సిటిజన్స్‌ కోటాలో వేస్తూ జోక్స్‌ వేస్తూనే ఉంటారు. ఇక ఆది సుధీర్‌ ప్లేబాయ్‌ ఇమేజ్‌ మీద మరోసారి జోక్స్‌ వేస్తూనే ఉంటారు.

ఇక వచ్చే ప్రసారమయ్యే ‘ఢీ’ షో ఎపిసోడ్‌ ప్రోమో రీసెంట్‌గా విడుదల చేశారు. అయితే అందులో కంటెస్టెంట్లు సాయి, నైనికా మధ్య నడిచిల లవ్‌ ట్రాక్‌ అందర్నీ ఎట్రాక్ట్‌ చేసిందని చెప్పాలి మరి. అయితే చాటింగ్స్‌లో రొమాన్స్‌ ఉంటుందని, స్టేజి మీద ఉండటం లేదని గతంలో ఓసారి సాయి గురించి నైనికా చెప్పిన సంగతి అందరికి తెలిసిన విదితమే. ఇక ఈసారి ఇద్దరూ ఒకరికొకరు లవ్యూ, లవ్యూ అని చెప్పుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

కాగా.. ప్రోమో చివర్లో పూర్ణ ఎమోషనల్‌ అయ్యారు. ఇక మీ ‘ఐ లాస్ట్‌ మై...’ అంటూ బోరున విలపించారు. అయితే చూస్తుంటే... ఏదో విషాదం చోటు చేసుకుందని తెలుస్తుంది. అంతేకాదు.. ఆమెను ఓదార్చడానికి పక్క సీట్లలో కూర్చునే ప్రియమణి, గణేష్‌ మాస్టర్‌ ప్రయత్నం చేస్తున్నారు. కాగా.. విషాదం ఏంటనేది తెలియాలంటే... బుధవారం వరకూ వెయిట్‌ చేయాల్సిందే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: