ప్రస్తుతం దేశంలో కరోనా ప్రభావంతో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఇకపోతే ఇదే నేపథ్యంలో ఇటీవలే కేంద్రం లాక్ డౌన్ కు కొన్ని సడలింపులను కూడా ఇచ్చింది. ఇక ఇప్పటికే ఆటో రంగలో తీవ్ర సంక్షోభం ఎదురుకొంటోంది. ఇక ఈ తరుణంలో వీలైనంతర తొందరగా తమ ప్లాంట్లలో కార్యకాలపాలను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధం అవుతున్నాయి. లాక్ డౌన్ అనంతరం తమ వినియోగదారులకు కంపెనీలు భారీ డిస్కౌంట్లను కూడా ఇవ్వబోతున్నాయి. 


ఇక ఈ జాబితాలో మొదట ఉన్న సంస్థ హ్యుండాయ్. ఏకంగా 6 కార్లపై భారీ రాయితీలను కంపెనీ ప్రకటించింది. ఇక ఇవన్నీ BS 6 మోడళ్లు కావడం విశేషం. అన్హతేకాకుండా ఇందులో హ్యుడాయ్ టక్సన్, ఎలంత్రా, ఇలైట్ i20 తదితర వాహనాలపై ఈ ఆఫర్లను హ్యుండాయ్ సంస్థ ప్రకటించింది. ఇకపోతే క్రితం కనువిందు చేసిన హ్యుండాయ్ టక్సన్ భారత్ లో ఇంకా లాంచ్ కూడా కాలేదు. ఇది వచ్చే 2, 3 నెలల్లో ఈ వాహనం భారత విపణిలోకి విడుదల అవుతుంది.  ఇకపోతే ఈ కార్ లాంచ్ అయిన తర్వాత ఈ కారుపై గరిష్ఠంగా 25000 రూపాయల వరకు క్యాష్ డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు మనకు తెలుస్తోంది.  

 
ఈ కోవలోకే మరో వాహనం హ్యుండాయ్ ఎలంత్రా. ఈ కార్ పై భారీగా లక్ష రూపాయల వరకు రాయితీని ఇచ్చింది సంస్థ. ప్రస్తుతం BS6 పెట్రోల్ మోడల్లో లభ్యమవుతున్న ఈ వాహనంపై ఎక్స్ ఛేంజ్ ఆఫర్లతో పాటు క్యాష్ డిస్కౌంట్ కూడా అందించింది. ఇంకా BS 6 ఇలైట్ i20 పెట్రోల్ మోడల్ పై ఏకంగా 35 వేల రూపాయల క్యాష్ డిస్కౌంటును కూడా ఇచ్చింది. 

అదేవిధంగా పాత గ్రాండ్ i10 వాహనంపై హ్యండాయ్ సంస్థ భారీగా అనగా 45 వేల రూపాయలను  రాయితీగా ఇవ్వబోతుంది. ఇంతే కాకుండా హ్యుండాయ్ శాంత్రో వాహనంలోని బేస్ ఎరా మోడల్ పై కూడా 30000, అందులోని ఇతర వేరియంట్లపై 40000 రూపాయల వరకు డిస్కౌంట్లను కంపెనీ ప్రకటించింది. అయితే ఇందులో గ్రాండ్ i10 నియోస్ మోడల్ కు మాత్రమే పెట్రోల్, డిజీల్ రెండు వేరియంట్లపై 25000 రూపాయల వరకు క్యాష్ డిస్కౌంటును కంపెనీ తెలిపింది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: