అందమైన ఇంకా దృఢమైన జుట్టును సొంతం చేసుకోవాలంటే ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ బియ్యాన్ని మీరు తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో రెండు గ్లాసుల నీళ్లు పోసి బియ్యాన్ని ఒక 20 నిమిసాల పాటు నానబెట్టాలి. ఆ తరువాత బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆ నీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి ఆ నీటిని  మొత్తం 24 గంటల పాటు పులియబెట్టాలి. ఇలా చేయడం వల్ల ఈ నీటిలో పోషకాల స్థాయిలు ఇంకా ఎక్కువ పెరుగుతాయి.ఇలా మీరు పులియ బెట్టిన బియ్యం నీటిని మన జుట్టుకు కావాల్సిన మోతాదులో ఒక గిన్నెలోకి తీసుకోని ఆ తరువాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను లేదా బాదం నూనెను కలపి ఆ తరువాత ఇందులో అర చెక్క నిమ్మరసాన్ని కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని మీ జుట్టు కుదుళ్లకు బాగా పట్టించాలి. ఈ నీటిని అరగంట పాటు అలాగే ఉంచుకుని ఆ తరువాత తలస్నానం  చేయడం వల్ల జుట్టు రాలడం ఈజీగా తగ్గుతుంది. చుండ్రు, దురద వంటి సమస్యలు కూడా చాలా ఈజీగా తగ్గుతాయి.


ఇంకా అలాగే బియ్యం కడిగిన నీటిలో ఇనోసిటాల్ తో పాటు ఇతర పోషకాలు కూడా చాలా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించడంతో పాటు జుట్టు పొడిబారడాన్ని కూడా చాలా ఈజీగా తగ్గిస్తాయి. ఈ విధంగా బియ్యం నీటిని వాడటం వల్ల జుట్టు ఒత్తుగా అలాగే నల్లగా పెరుగుతుంది. జుట్టు మృదువుగా ఇంకా కాంతివంతంగా కూడా తయారవుతుంది.అయితే ఎలాంటి జుట్టు సమస్యలు లేని వారు ఈ బియ్యం కడిగిన నీటిని మరో విధంగా ఉపయోగించాలి. తలస్నానం చేసిన తరువాత ఈ నీటిని జుట్టు పట్టించి 4 నుండి 5 నిమిషాల పాటు ఈ నీటిని అలాగే ఉంచి ఆ తరువాత మామూలు నీటితో శుభ్రంగా కడిగివేయాలి. ఇలా చేయడం వల్ల బియ్యం కడిగిన నీళ్లు జుట్టుకు మంచి కండీష్ నర్ లాగా పని చేస్తాయి.ఇక బియ్యం కడిగిన తరువాత వచ్చే నీటిని పడబోయకుండా ఈ విధంగా ఉపయోగించడం వల్ల మనం చక్కటి అందమైన, ఒత్తైన ఇంకా పొడవైన జుట్టును చాలా ఈజీగా సొంతం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: