మధ్యప్రదేశ్ బిజేపి అభ్యర్థి, ఆ రాష్ట్ర మంత్రి ఇమార్తీ దేవీకి ఎన్నికల సంఘం షాకిచ్చింది. ఒకరోజు పాటు ప్రచారం నిర్వహించకుండా నిషేధం విధించింది. ఎన్నికల కోడ్​ను ఉల్లంఘించినందుకు ఈ చర్యలు చేపట్టినట్లు ఈసీ తెలిపింది. నవంబర్ 1న ఈ ఆదేశాలు అమలు అవుతాయని వెల్లడించింది.ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రత్యర్థితో పాటు వారి కుటుంబంలోని మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఇమార్తీ దేవీకి మంగళవారమే నోటీసులు జారీ చేసింది ఈసీ. దీనిపై వివరణ ఇచ్చిన ఇమార్తీ.. ఆరోపణలను ఖండించారు. ఈ నేపథ్యంలో ఈసీ తాజా ఆదేశాలు జారీ చేసింది.

 ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఇమార్తీ ఉల్లంఘించారని పేర్కొంది.మధ్యప్రదేశ్​లో జరగనున్న 28 అసెంబ్లీ ఎన్నికల బైపోలింగ్​కు ప్రచారం నవంబర్ 1తోనే ముగియనుండటం గమనార్హం.మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్​నాథ్ స్టార్ క్యాంపెయినర్ హోదాను ఈసీ ఇదివరకే రద్దు చేసింది. పదేపదే నియమావళిని ఉల్లంఘించడం కారణంగా పేర్కొంది. అంతకుముందు ఇమార్తీ దేవీ లక్ష్యంగానే కమల్​నాథ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం వివాదాస్పదమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: