ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో నాలుగు మునిసిపాలిటీల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది. నరసాపురం.. వైఎన్ కాలేజ్‌లో - జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డులో - కొవ్వూరు దీప్తి ఇంగ్లీషు మీడియం స్కూలులో - నిడదవోలు.. ఉమెన్స్ కాలేజ్‌లో ఓట్ల లెక్కింపు కేంద్రాల ఏర్పాటు చేశారు. * జంగారెడ్డిగూడెం 29 వార్డులు,  నరసాపురం 28, నిడదవోలు 28, కొవ్వూరు 10 వార్డులకు ఎన్నికలు జ‌రిగాయి.  కౌంటింగ్ కేంద్రాల వద్ద సీఆర్ పీసీ  144వ సెక్షన్ ఏర్పాటు చేయ‌డంతో పాటు పోలీసు యాక్ట్ 30 అమలు చేస్తున్నారు. కౌంటింగ్ అనంతరం ఊరేగింపులు,  బాణాసంచా కాల్చడం నిషేధించారు. ఇక ఈ నెల 23వ తేదీన  ఏలూరు కార్పోరేషన్ ఓట్ల లెక్కింపు చేప‌ట్ట‌నున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: