నంద‌మూరి బాల‌క్రిష్ణ ఆహాలో బాల‌య్య అన్ స్టాప‌బుల్ అనే టాక్ షో చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్ప‌టికే ఈ షోకు సంబంధించిన ప్రోమో ఇప్ప‌టికే విడుద‌ల కాగా అభిమానులను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఇక ఆహాలో ఈ షో కుసంబంధించిన ప్రీమియ‌ర్స్ దిపావ‌ళి సంధ‌ర్బంగా ప్ర‌స్తుతం ప్ర‌సార‌మ‌వుతున్నాయి. అయితే ప్రోమోలో నాన్న‌గారు స్థాపించిన టీడీపీ పార్టీ ప‌గ్గాలు త‌ద‌నంత‌రం నువ్వు తీసుకోకుండా చంద్ర‌బాబుకు ఎందుకిచ్చావ్. అంటూ మోహ‌న్ బాబు ప్ర‌శ్నించిన విష‌యం తెలిసిందే. అయితే షోలో ఆ ప్ర‌శ్న‌ల‌కు బాల‌య్య ఆస‌క్తిక‌ర‌ స‌మాధానం ఇచ్చారు. 

మా తెలుగు దేశం పార్టీ పెట్టిందే వారసత్వ రాజకీయాలకి అతీతంగా అంటూ బాల‌య్య చెప్పారు. పెద్దాయన తరవాత మేము తీసుకుంటే ఇంకా దానికి అర్థం ఏం ఉంటుందని బాల‌య్య వ్యాఖ్యానించారు. చంద్రబాబు గారు చాలా కష్టపడే తత్త్వం ఉన్న వ్యక్తి అని ఆయన కాలేజీ, గ్రామ, మండల స్థాయి రాజకీయాల నుండే అన్ని చూసి వచ్చిన మనిషి అంటూ బాల‌క్రిష్ణ చెప్పుకొచ్చారు. ఇక ఈ షోలో మ‌రికొన్ని ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌ల‌ను బాల‌య్య అడిగారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: