ఏపీలో ఎక్కడికక్కడ టీడీపీ నేతలను అరెస్టు చేస్తున్నారు. ఎందుకంటే.. ఇవాళ విజయవాడలో టీడీపీ ఎస్సి సెల్ దళిత గర్జన ధర్నా నిర్వహించాలని నిర్ణయించింది. అయితే.. ఇందుకు  పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసుల అనుమతి నిరాకరించడాన్ని నిరసిస్తూ విజయవాడ ధర్నా చౌక్ సమీపంలో టీడీపీ నేతలు ధర్నా చేశారు. టీడీపీ ఎస్సి సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజు, ఇతర ఎస్సీ నేతలు వాటర్ ట్యాంక్ ఎక్కారు.

ఇక దళిత గర్జన కు వస్తున్న ఎస్సీలను ఎక్కడికి అక్కడ పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. విజయవాడలో టీడీపీ ఎస్సీ సెల్ నేతల అరెస్ట్ చేశారు. వాటర్ ట్యాంక్ ఎక్కిన నేతలను బలవంతంగా వాటర్ ట్యాంక్ నుంచి దింపి పోలీసులు అరెస్టు చేశారు. దళిత గర్జన కు వస్తున్న ఎస్సీలను ఎక్కడికి అక్కడ అరెస్టులు చేస్తున్నారు. తమ హయాంలోనూ ఇలాగే వ్యవహరిస్తే.. వైసీపీది ఒక్క సభ అయినా జరిగేదా అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: