
అనేక మంది గొప్ప కవులు ఉన్న వారసత్వం తెలంగాణదని.. ఎందరో తెలంగాణ రచయితలు ప్రజల హృదయాలలో తరతరాలుగా గుర్తుండిపోయేలా రచనలు చేశారని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేసుకున్నారు. వారి వారసత్వాన్ని కొనసాగిస్తూ గోరటి వెంకన్న వల్లంకి తాళం రచన చేశారని.. వర్క్ లోంచి పుట్టిన పదాలను ఇటలీ భాషలో ఉపయోగిస్తారు..తెలంగాణలో కూడా మన కష్టాలను , శ్రమను పదాలుగా వినియోగిస్తున్నామని అన్నారు. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ గోరటి వెంకన్న వల్లంకి తాళం రచన చేశారని.. మట్టి తత్వాన్ని అణువణువునా మీ రచనలో చెప్పారని.. చిన్న చిన్న పదాలతో అద్భుతంగా రాశారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మీరు పుట్టిన ఈ కాలంలో పుట్టినందుకు గర్వంగా ఉంది..మీతో పాటు కౌన్సిల్ లో కూర్చోవడం సంతోషంగా ఉందని గోరటి వెంకన్నతో ఎమ్మెల్సీ కవిత చెప్పారు.