సీఎం అనాలోచిత నిర్ణయాల వల్ల వ్యవసాయం కుదేలయిందని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రైతుబంధు పేరుతో రైతులకు రావాల్సిన అన్ని సబ్సిడీలకు మంగళం పాడారని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. రైతుబంధు భూస్వాములకు వరంగా ఉందని...కౌలు రైతులను పట్టించుకునే పాపాన పోలేదని దుయ్యబట్టారు. రుణమాఫీ లేక రైతులు గోసపడుతున్నారని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో రైతు ఆత్మహత్యల విషయంలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని.. రైతు ఆత్మహత్యలను అవహేళన చేస్తూ ఓ సన్యాసిలా మాట్లాడిన వ్యవసాయశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.
సీఎం అనాలోచిత నిర్ణయాల వల్ల వ్యవసాయం కుదేలయిందని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రైతుబంధు పేరుతో రైతులకు రావాల్సిన అన్ని సబ్సిడీలకు మంగళం పాడారని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. రైతుబంధు భూస్వాములకు వరంగా ఉందని...కౌలు రైతులను పట్టించుకునే పాపాన పోలేదని దుయ్యబట్టారు. రుణమాఫీ లేక రైతులు గోసపడుతున్నారని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో రైతు ఆత్మహత్యల విషయంలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని.. రైతు ఆత్మహత్యలను అవహేళన చేస్తూ ఓ సన్యాసిలా మాట్లాడిన వ్యవసాయశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.