మనలో చాలా మందికి కూడా ప్రతిరోజూ దంతాలను శుభ్రం చేసుకున్నప్పటికి దంతాలు ఎప్పుడు పసుపు రంగులో ఉంటున్నాయి. దీంతో వాళ్లు సరిగ్గా  మాట్లాడలేక, చక్కగా నవ్వలేక  చాలా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు.ఇక దంతాలపై గార పేరుకుపోవడంతో పాటు నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలతో కూడా మనలో చాలా మంది ఎంతగానో బాధపడుతున్నారు. ఈ సమస్య నుండి బయటపడడానికి చాలా టూత్ పేస్ట్ లను వాడుతూ ఉంటారు. అయినా ఎలాంటి ఫలితం లేక బాధపడే వారు  చాలా మంది ఉన్నారు. అలాంటి వారు ఒక సులభమైన ఇంటి చిట్కాను వాడడం వల్ల దంతాలను రెండు రోజుల్లోనే ఈజీగా తెల్లగా మార్చుకోవచ్చు.ఇక దంతాలపై ఉండే గారను, పసుపుదనాన్ని తొలగించి దంతాలను తెల్లగా మార్చే ఈ టిప్ ఏమిటి..ఇక దీనిని ఎలా తయారు చేసుకోవాలి..వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇక ఈ టిప్ ని వాడడం కూడా చాలా ఈజీ. దీనిని తయారు చేసుకోవడానికి  మనం కేవలం మూడు పదార్థాలనే వాడాల్సి ఉంటుంది.


ఇంకా ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి గానూ ముందుగా ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ పసుపును మీరు తీసుకోవాలి. ఆ తరువాత ఇందులో అర టేబుల్ స్పూన్ ఉప్పు ఇంకా పావు టేబుల్ స్పూన్ వంటసోడా వేసి కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని నేరుగా బ్రష్ తో తీసుకుని దంతాలను బాగా శుభ్రం చేసుకోవచ్చు లేదా ఇందులో నీళ్లు కలిపి పేస్ట్ లా చేసుకుని కూడా దంతాలను బాగా శుభ్రం చేసుకోవచ్చు.ఇక ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల దంతాలపై ఉండే పసుపుదనం చాలా ఈజీగా తొలగిపోతుంది. దంతాలు కూడా చాలా తెల్లగా మారతాయి. ఇంకా అంతేకాకుండా ఈ చిట్కాను వాడడం వల్ల నోట్లో ఉండే బ్యాక్టీరియా ఈజీగా నశిస్తుంది. నోటి దుర్వాసన కూడా వెంటనే తగ్గుతుంది. చిగుళ్లు సమస్యలు తగ్గి చిగుళ్లు చాలా ఆరోగ్యంగా మారతాయి.ఇంకా దంతాల సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ విధంగా ఈ టిప్ ని వారానికి రెండు నుండి మూడు సార్లు వాడడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితాలను పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: