ఈరోజు ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. వివిధ రాష్ట్రాల సీఎంలు లాక్ డౌన్ ను మరోసారి పొడిగించాలని కోరారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్, తెలంగాణ సీఎం కేసీఆర్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ తో మాత్రమే కరోనాను నియంత్రించడం సాధ్యమని చెప్పారు. ప్రస్తుతం కేంద్రం కొనసాగిస్తున్న లాక్ డౌన్ ఈ నెల 17తో ముగియనుంది. 
 
తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఈ నెల 29 వరకు లాక్ డౌన్ పొడిగించగా పలు రాష్ట్రాలు ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్టు ప్రకటన చేశాయి. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్రం లాక్ డౌన్ ను పొడిగించటానికే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీ లాక్ డౌన్ ను పొడిగించే అవకాశం ఉందని అన్ని రాష్ట్రాల సీఎంలు నిబంధనలను పరిస్థితులకు అనుగుణంగా సడలించాలని చెప్పినట్టు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: