తెలంగాణ రాష్ట్రంలో అరెస్ట్ ల పర్వం కొనసాగుతోంది. ఎస్.ఎల్.బీ.సీ ప్రాజెక్ట్ సందర్శనకు వెళుతున్న కోమటిరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లాలోని ఇతర కాంగ్రెస్ నాయకులను కూడా అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. నల్గొండ జిల్లా కృష్ణపల్లి మండలం దగ్గర కోమటిరెడ్డిని అడ్డుకోవడంతో ఆయన హైవే రోడ్డుపై బైఠాయించారు. ఆయన రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
అనంతరం అదే మార్గంలో వెళుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డిలను అరెస్ట్ చేశారు. ముగ్గురు కాంగ్రెస్ సీనియర్ నేతలను అరెస్ట్ చేయడంపై కాంగ్రెస్ నేతల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇతర జిల్లాల్లో కూడా అరెస్ట్ లు జరుగుతున్నాయి. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించడం వల్లే అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: