జూబ్లీ బస్టాండ్​లో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఓ వ్యక్తిని పోలీసులు రక్షించే లోపే అతను చనిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సికింద్రాబాద్​ జూబ్లీ బస్ స్టేషన్ వద్ద మారేడిపల్లి పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అంబులెన్స్​కు సమాచారం అందించి ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 


నగరంలో అనుమానస్పద స్థితిలో మరణించే వారి సంఖ్య రోజు రోజుకు భారీగా పెరుగుతుంది. ప్రతి రోజూ ఎదో ఒక ఏరియా లో దిక్కు మొక్కు లేని యాచకులు దగ్గర నుంచి సాధారణ ప్రజలు వరుకు బాగా మరణాలు పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: