ఇటీవల వైసీపీ ఎంపీ రఘురామా కృష్ణం రాజు పార్టీ ఎమ్మెల్యేలపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలు అటు వైసీపీ లో ఇటు రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర దుమారం రేపాయి. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యాలి అంటూ పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు డిమాండ్ కూడా చేసి సిఎం వైఎస్ జగన్ ముందు కూడా పెట్టిన సంగతి తెలిసిందే.

 

ఇక తాజాగా ఆయనకు పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. వారం లోగా సమాధానం చెప్పాలి అని స్పష్టం చేసింది వైసీపీ అధిష్టానం. లేకపోతే చర్యలు ఉంటాయి అని హెచ్చరించింది. ఇక తన ప్రాణాలకు ముప్పు ఉంది అని ఆయన లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ కూడా రాసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: