ఆంధ్ర‌ప్ర‌దేశ్ పౌర‌స‌ర‌ఫ‌రాల‌శాఖ మంత్రి కొడాలి నానితో వంగ‌వీటి రంగా కుమారుడు వంగ‌వీటి రాధా భేటీ అయ్యారు. అది కూడా గుడివాడ‌లోని నాని ఫంక్ష‌న్‌హాల్లోనే కావ‌డం విశేషం. వంగ‌వీటి రాధా గుడివాడ నియోజ‌క‌వ‌ర్గం నుంచి తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున పోటీచేస్తారంటూ కొద్దిరోజులుగా సామాజిక మాధ్య‌మాల్లో వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. ప్ర‌యివేటు ఫంక్ష‌న్‌కు హాజ‌రైన రాధా నానితోపాటు వైసీపీ నాయ‌కుల‌తో అక్క‌డే ఒక గ‌దిలో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. వంగ‌వీటి త్వ‌ర‌లోనే వైసీపీ గూటికి చేర‌నున్నార‌నే వార్త‌ల‌కు ఈ భేటీ మ‌రింత బ‌లం చేకూర్చింది. 2019 ఎన్నిక‌ల తర్వాత తెలుగుదేశం పార్టీలో కార్య‌క‌లాపాలు త‌గ్గించిన రాధా వైసీపీలో చేర‌డానికి ప్ర‌య‌త్నాలు ప్రారంభించారంటూ వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆయ‌న వాటిని కొట్టేశారు. వైసీపీలో ఉన్న‌ప్పుడు త‌న తండ్రి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించ‌డానికి కూడా జ‌గ‌న్ అనుమ‌తి తీసుకోవాల్సి ఉంటుంద‌ని, త‌న తండ్రి విగ్ర‌హానికి ఇత‌రుల అనుమ‌తి ఎందుక‌ని, స్వేచ్ఛ లేదంటూ ఆయ‌న పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: