పేకాట నిర్వహిస్తున్న వ్యక్తిపై పీడీయాక్ట్ కేసు నమోదు చేయనున్నారు. చరిత్రలో ఫస్ట్ టైమ్ ఈ యాక్ట్ భుజాన వేసుకున్న వ్యక్తి గుత్తాసుమన్. హైదరాబాద్ నగర శివారులోని నాగశౌర్య ఫామ్హౌస్లో ఓ రేంజ్లో పేకాట నిర్వహించిన ఘనుడు అతను. మొత్తం ఆ రోజు 30మంది వరకూ పేకాటరాయుళ్లు పట్టుబడ్డారు. శ్రీరామ్ భద్రయ్య లాంటి మాజీ ఎమ్మెల్యేతో పాటు నిజామాబాద్, విజయవాడ వంటి ప్రాంతాల నుంచి వచ్చిన బడాబాబులూ కూడా ఉన్నారు. సినో చిప్స్, నోట్ల కట్టలు, స్వైపింగ్ మిషీన్స్, కావల్సినంత మందు, వెరైటీ ఫుడ్.. అబ్బో ఒక్కటేంటి వీకెండ్ మజా అంతా అక్కడే ఏమి చక్కగా దర్శనమిచ్చింది. నాగశౌర్య తండ్రికి బెయిల్ మంజూరవుతుందా లేక జైలు శిక్ష పడనుందా అని కొంత సమయం తరువాత తెలియనుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి