త‌మిళ‌నాడు రాష్ట్రంలోని కూనూరు వ‌ద్ద ఆర్మీ హెలికాప్ట‌ర్ కూలిన విష‌యం విధిత‌మే. అయితే ప్ర‌మాద స‌మ‌య‌ములో సీడీఎస్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్  దంప‌తుల‌తో పాటు మొత్తం 14 మంది ఆర్మీ సిబ్బంది ఉన్నారు. అయితే ఈ ప్ర‌మాదంలో ఇప్ప‌టివ‌ర‌కు 11 మంది మ‌ర‌ణించిన‌ట్టు తెలుస్తున్న‌ది. ఈ ప్ర‌మాదంలో ఇప్ప‌టికే బిపిన్ రావ‌త్ భార్య మ‌ధులిక మ‌ర‌ణించిన‌ట్టు స‌మాచారం. అధికారికంగా వెల్ల‌డించ‌లేదు. బిపిన్ రావ‌త్  తీవ్ర గాయాలై చికిత్స పొందుతున్నట్టు తెలుస్తున్న‌ది.

 అయితే తాజాగా సీడీఎస్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్‌తో పాటు ఆయ‌న భార్య మ‌ధులిక క్షేమంగా ఉండాల‌ని.. వీరు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ట్విట్ చేసారు. సూలూరు వ‌ద్ద ఉద‌యం 11.47 గంట‌ల‌కు హెలికాప్ట‌ర్ బ‌య‌లు దేరింది. 12.27 గంట‌ల‌కు హెలికాప్ట‌ర్ ప్ర‌మాదానికి గురైంది. 1.30 ప్ర‌మాదాన్ని ర‌క్ష‌ణ శాఖ ధృవీక‌రించిన‌ది. దేశ సేవ కోసం ప్రాణాలు అర్పించిన ఆర్మీ అధికారులు హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో మృతి చెంద‌డంతో ప‌లువ‌రు దిగ్బ్రాంతి వ్య‌క్తం చేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: