హైదరాబాద్ ట్యాంక్ బండ్‌ పై కొత్తగా మరో విగ్రహం ఏర్పాటు కాబోతోంది. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ట్యాంక్ బండ్‌పై కొలువుదీరబోతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి మనసుతో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహం ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసేందుకు జీవో జారీ చేయడం ఆనందంగా ఉందని తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణరావు గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. పాపన్న గౌడ్ సేవలను ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించినందుకు.. ఎన్నో రోజులుగా తాము చేస్తున్న పోరాటం ఫలించిందన్నారు.  


హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని గౌడ హాస్టల్ భవనంలో పాపన్నగౌడ్ విగ్రహంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ ల చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. పాపన్న గౌడ్ విగ్రహం ట్యాంక్ బండ్ పై ఏర్పాటు అనేక గౌడల ఆకాంక్ష అంటున్నారు లక్ష్మణరావు గౌడ్. తమ ఆకాంక్షలను గౌరవిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. గౌడ కులస్తులను తెరాస ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటూ ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని లక్ష్మణరావు గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: