ఉద్యోగాలను క్రమబద్ధీకరణ చేయాలని అడిగితే ఏదైనా కూలీపని చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఏఎన్ఎం లకు క్షమాపణ చెప్పాలని వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య హైదరాబాద్‌లో డిమాండ్ చేశారు. సెకండ్ ఏఎన్ఎంల సర్వీసులను క్రమబద్ధీకరించాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలనే డిమాండ్ తో కోఠీలోని ఎన్ హెచ్ ఎం కమిషనర్ కార్యాలయం ముందు ఆయన మహాధర్నా నిర్వహించారు.

కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను ఫనంగా పెట్టి విధులు నిర్వహించిన... సెకండ్ ఏఎన్ఎంలను రాష్ట్ర ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకుంటుందని ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. ఆరోగ్య తెలంగాణ సాధనలో వీరి పాత్ర కీలకమైందన్న ఆర్ కృష్ణయ్య .. వీరి సేవలను గుర్తించి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం పర్మినెంట్ చేసిందన్నారు.  కర్ణాటక, ఏపీ రాష్ట్రాలలో జీతాలు పెంచాయని ఆర్ కృష్ణయ్య గుర్తు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: