తెలంగాణలో మరో జిల్లా కోసం పోరాటం మొదలైంది. ప్రత్యేక జిల్లా ఏర్పాటు తోనే సికింద్రాబాద్  అభివృద్ధి  సాధ్యమని సికింద్రాబాద్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ అంటున్నారు. సికింద్రాబాద్ జిల్లాను ఏర్పాటు చేయాలని కోరుతూ రూపొందించిన పోస్టర్లను ఆయన  ఆవిష్కరించారు.  7 అసెంబ్లీ నియోజకవర్గాలు, 40 జీహెచ్‌ఎంసీ డివిజన్ లతో కలిపి సికింద్రాబాద్ జిల్లాను ఏర్పాటు చేయాలని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి వినతిపత్రాలను అందజేశామని గుర్రం పవన్ కుమార్ గౌడ్ తెలిపారు.

పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులను కలిసి జిల్లా సాధన ఉద్యమానికి మద్దతు కోరుతున్నామని గుర్రం పవన్ కుమార్ గౌడ్ అన్నారు.  సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటయ్యే వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని అన్నారు. అన్ని వర్గాల ప్రజల మద్దతుతో జిల్లా సాధన ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసి... జిల్లా ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువస్తామని గుర్రం పవన్ కుమార్ గౌడ్ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: