అమరావతే రాజధానిగా ఉండాలని ఆ ప్రాంత టీడీపీ కార్యకర్తలతో పాటు వైసీపీ నాయకులు కూడా అభిప్రాయపడుతుంటారు. కానీ వీరంతా గంపగుత్తుగా టీడీపీ కూటమికే ఓటేశారా అంటే కచ్ఛితంగా కాదు. ఎన్నికల్లో పోరు హోరాహోరీగా సాగింది. ఒకవేళ ఇది ప్రభావ వంతమైన అంశం అయితే ఈ రెండు జిల్లాల్లో టీడీపీ స్వీప్ చేయాలి. కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎంతో కంత ప్రభావమున్నా.. ఇదే డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


ఈ ఎన్నికల్లో టీడీపీ కూడా అమరావతి అంశాన్నీ కీలకంగా ప్రస్తావించలేదు. కేవలం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించే ప్రచారమంతా సాగింది. అందుకు అనుగుణంగానే పేపర్ ప్రకటనలు సాగాయి. ఇక మూడు రాజధానులు అంశాన్ని కూడా ఆయా ప్రాంత ప్రజలు కోరకుంటారు. వాళ్ల పరిసరాలు అభివృద్ధి చెంది భూములకు మంచి ధరలు వస్తాయని.. అంత మాత్రాన వీరంతా కూడా వైసీపీకి ఏకపక్షంగా ఓటేయ్యలేదు. అటు అమరావతి కానీ.. ఇటు మూడు రాజధానులు కానీ ఉండాలని ఆయా ప్రాంత వాసులు కోరుకున్నారు తప్ప దీనిని ఆధారంగా చేసుకొని ఓటింగ్ సాగలేదని పోలింగ్ సరళిని చూస్తే అర్థం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: