పహల్గాంలో జరిగిన దాడికి భారత్, పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులకు దిగింది. కాశ్మీర్ పీవోకే లో భారత సైన్యం దాడులు నిర్వహించింది. ఈ దాడులను "ఆపరేషన్ సింధూర్" పేరుతో భారత్ ప్రభుత్వం మొదలుపెట్టింది.  పాకిస్తాన్ లోని కోట్లీ, మురిడ్కే, బహవల్పూర్‌, ముజఫరాబాద్‌ ప్రాంతాల్లో దాడులు చేసినట్లు భారత్ అధికారికంగా ప్రకటించింది. ఈ దాడికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రధాని షహబాబ్ షరీఫ్ స్పందించారు. పాక్ పై జరుగుతున్న దాడులకు ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. పాకిస్తాన్ భారత్ పై చర్యలు కచ్చితంగా తీసుకుంటుందని తెలిపారు. భారతదేశం పాకిస్తాన్ కి ఎప్పుడు శత్రువేనని అన్నారు. భారత్ పాక్ లోని ఐదు ప్రాంతాల్లో దాడులు జరిపిందని స్పష్టం చేశారు. దీనికి పాకిస్తాన్ భారత్ ని వదిలిపెట్టదని కచ్చితంగా బదులు తీర్చుకుంటుందని పాక్ ప్రధాని చెప్పుకొచ్చారు. పాక్ సైన్యం వెంట దేశమంతా నిలబడి ఉందని వెల్లడించారు. శత్రువులను ఎలా ఎదురుకోవాలనేది.. ఎలా ఓడించాలనేది పాకిస్తాన్ ఆర్మీకి బాగా తెలుసు అని అన్నారు. పాకిస్తాన్ ఆర్మీ ప్రత్యర్థుని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనివ్వదని షహబాజ్ షరీఫ్ తెలిపారు.


ఇక పాకిస్తాన్ ప్రధాని ప్రకటనలు విన్న తర్వాత పాకిస్తాన్ ఆర్మీ దాడులకు దిగింది. పాకిస్తాన్ ఆర్మీ పూంఛ్, రాజౌరి సెక్టార్లలో కాల్పులు మొదలుపెట్టింది. భారత్ కూడా దాడులు చేస్తుంది. ఇటు భారత్, అటు పాకిస్తాన్ ఇరుదేశాల సైనికులు కాల్పులు జరుపుతున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ దాడిలో ముగ్గురు చనిపోయారని పాక్ ఆర్మీ వెల్లడించింది. అలాగే 12 మందికి గాయాలయ్యాయని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: