నేటి సభ్య సమాజంలో మానవత్వం ఉన్న మనుషులు కంటే కామంతో కళ్ళు మూసుకుపోయి మానవ మృగాలుగా మారిపోతున్న రాక్షసులే ఎక్కువగా కనిపిస్తున్నారు అని చెప్పాలి. ఆడపిల్ల ఒంటరిగా కనిపించింది అంటే చాలు ఇక ఎంతోమంది మగాళ్లు మృగాలుగా మారిపోతూ దారుణంగా అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఇలా ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిని శిక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకువచ్చిన కామాంధుల తీరులో మాత్రం మార్పు రావడం లేదు అని చెప్పాలి..


 వెరసి నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే ఆడపిల్లల తల్లిదండ్రులకు కంటిమీద కునుకు వేయకుండా పోతుంది. ఇక మహిళా సాధికారతను సాధించాలనుకుంటున్న ఆడపిల్ల ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు ఒంటరిగా ఉన్న ఆడపిల్లలపై మాత్రమే అత్యాచారం చేసేవారు. కానీ ఇటీవల కాలంలో పక్కన ఎవరైనా ఉన్నా వారిపై దాడి చేసి మరి ఆడపిల్లలపై అత్యాచారం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.  ఇక్కడ ఇలాంటిదే జరిగింది.


 కృష్ణాజిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్ లో యువతిపై గంజాయి బ్యాచ్ అత్యాచారానికి పాల్పడింది. ప్రేమికుల జంట నిర్మానుష్య  ప్రదేశానికి వెళ్లడం గమనించిన నిందితులు ఆటోలో వెనకనుంచి వెళ్లి యువకుడి పై దాడి చేసి తాళ్లతో ఒక చెట్టుకు కట్టేశారు. ఇక అంతటితో ఆగకుండా యువతిపై అత్యాచారం చేయబోయారు. అయితే యువతి భయంతో గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. దీంతో నిందితులు ఇది గమనించి అక్కడ నుంచి పరారయ్యారు.. స్థానికులు నిందితుల్లో ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాగా ఒక నిందితుడు పట్టుబడటంతో.. ఈ ఘటనతో సంబంధం ఉన్న మరికొంత మంది నిందితుల వివరాలను తెలుసుకుంటున్నారు పోలీసులు. ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: