ప్రస్తుతం దేశం మొత్తం టెక్నాలజీ వెంట పరుగులు పెడుతుంది. ఇలాంటి సమయం లోనే అందుబాటు లోకి వచ్చిన టెక్నాలజీ అటు మనిషి జీవన శైలిలో కూడా ఎన్నో మార్పులు తీసుకు వస్తుంది. దీంతో ఒకప్పటి మూఢ నమ్మకాలను ఆచారాలను పక్కన పెడుతున్న మనుషులు.. ఇక్కడ టెక్నాలజీకి అనుగుణం గానే జీవన శైలిని సాగిస్తూ ఉన్నారు. ఈ క్రమం లోనే పెరిగి  పోయిన టెక్నాలజీతో అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్లోనే ప్రపంచాన్ని చుట్టేసి అవకాశం కూడా అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. అయితే ఇలాంటి టెక్నాలజీ యుగంలో కూడా కొంతమంది ఇంకామూఢనమ్మకాలను పట్టుకుని వేలాడుతున్నారు అని నిరూపించే ఘటనలు కొన్ని వెలుగులోకి వస్తున్నాయి.



 మంత్రాలకు చింతకాయలు రాలుతాయని ఇప్పటికి ఎంతోమంది విశ్వసిస్తున్నారు. దయ్యం భూతం ఉంది అని నమ్ముతూ ఇంకా అనాగరిక పోకడలకు పోతున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక క్షుద్ర పూజలు చేస్తున్నారు అనే కారణంతో ఎంతోమందిపై దారుణంగా దాడులు చేస్తున్న ఘటనలు కూడా వెలుగుచూస్తున్నాయి. ఇక ఇటీవల ఇలాంటి తరహా ఘటన జరిగింది. మంత్రాలు చేస్తూ చేతబడులు చేస్తుంది అన్న కారణంతో ఒక మహిళపై దారుణంగా దాడి చేశారు గ్రామస్తులు. ఈ ఘటన స్థానికంగా సంచలనం గా మారిపోయింది అని చెప్పాలి. మెదక్ జిల్లాలోని నిజాంపేట మండలంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.


 నిజాంపేట మండలం నందిగామ గ్రామానికి చెందిన ఇబడి సత్తవ్వ మంత్రాలు చేస్తుంది అనే నెపంతో గ్రామస్తులందరూ కూడా ఆమెపై దారుణంగా దాడికి పాల్పడ్డారు. అయితే తనకేం తెలియదు అని సత్తవ్వ  వేడుకుంటున్న కనీసం కనికరం చూపలేదు. అయితే ఈ ఘటన సంచలనంగా మారగా సత్తవ్వ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనె రంగంలోకి దిగిన పోలీసులు 9 మందిని అరెస్టు చేశారు. కాగా ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన సత్తవ్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: